Share News

Vande Bharat train: మార్చి 27 వరకు చెన్నై-మైసూరు వందేభారత్‌ రైలు

ABN , Publish Date - Feb 03 , 2024 | 12:17 PM

చెన్నై - మైసూరు(Chennai - Mysore)ల మధ్య వారానికోసారి నడిచే వందేభారత్‌ స్పెషల్‌ రైలు సేవలను పొడిగిస్తూ నైరుతి రైల్వే నిర్ణయం తీసుకుంది.

Vande Bharat train: మార్చి 27 వరకు చెన్నై-మైసూరు వందేభారత్‌ రైలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): చెన్నై - మైసూరు(Chennai - Mysore)ల మధ్య వారానికోసారి నడిచే వందేభారత్‌ స్పెషల్‌ రైలు సేవలను పొడిగిస్తూ నైరుతి రైల్వే నిర్ణయం తీసుకుంది. నెం. 06037 డా. ఎంజీఆర్‌ చెన్నయ్‌ - మైసూరు వందేభారత్‌ రైలు సేవలు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమై మార్చి 27 వరకు ఉంటాయి. కాగా 06038 మైసూరు-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ వందేభారత్‌ రైలు సేవలు కూడా మార్చి 27 వరకు ఉంటాయని ఇరువైపులా మొత్తం 8 ట్రిప్పుల మేరకు ఈరైలు సంచరించనుందని ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల నుంచి రైలుకు స్పందన బాగుండటంతోనే పొడిగించామని అధికారులు వెల్లడించారు.

Updated Date - Feb 03 , 2024 | 12:17 PM