Share News

Patna: వివాదంలో తేజస్వీ యాదవ్.. హత్య కేసు నిందితుడితో ఫొటోలు

ABN , Publish Date - Feb 24 , 2024 | 07:50 PM

బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) వివాదంలో చిక్కుకున్నారు. ఓ హత్యకేసు నిందితుడు తేజస్వీని కలవడం.. వారిరువురు కలిసి ఫొటోలు దిగడం.. అవి కాస్తా వైరల్ కావడంతో రాజకీయాలు వేడెక్కాయి.

Patna: వివాదంలో తేజస్వీ యాదవ్.. హత్య కేసు నిందితుడితో ఫొటోలు

పట్నా: బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) వివాదంలో చిక్కుకున్నారు. ఓ హత్యకేసు నిందితుడు తేజస్వీని కలవడం.. వారిరువురు కలిసి ఫొటోలు దిగడం.. అవి కాస్తా వైరల్ కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. షార్ప్ షూటర్, ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ కైఫ్‌తో దిగిన ఫొటోలను బీజేపీ OBC మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ ఎక్స్‌లో షేర్ చేశారు.

"తేజస్వీ నేతృత్వంలోని ఆర్జేడీ విధానాలు కొత్తగా ఏమీ లేవు. కొత్త సీసాలో పాత సారా పోసినట్లుగానే ఉంది. బిహార్(Bihar) రాజకీయాల్లోకి నేరస్థులను తీసుకొచ్చిన క్రెడిట్ ఆర్జేడీకే దక్కుతుంది. తేజస్వీ, మహ్మద్ మధ్య మంచి సంబంధం ఉంది. అందుకే వారిరువురు కలిశారు" అని ఆయన పోస్ట్‌లో విమర్శించారు. తేజస్వీ నిర్వహిస్తోన్న జన్‌ విశ్వాస్‌ యాత్రలో భాగంగా సివాన్‌లో వారిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీ వివాదంగా మారుతుండటంతో అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 24 , 2024 | 07:50 PM