Share News

Sumalata: సుమలతతో బీజేపీ రాష్ట్ర చీఫ్ చర్చలు..

ABN , Publish Date - Mar 30 , 2024 | 01:12 PM

మండ్య ఎంపీ సుమలత(Mandya MP Sumalatha)ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర(Vijayendra) భేటీ అయ్యారు.

Sumalata: సుమలతతో బీజేపీ రాష్ట్ర చీఫ్ చర్చలు..

బెంగళూరు: మండ్య ఎంపీ సుమలత(Mandya MP Sumalatha)ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర(Vijayendra) భేటీ అయ్యారు. శనివారం జేపీనగర్‌లోని సుమలత నివాసానికి వెళ్లిన విజయేంద్ర తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. మండ్య నుంచి మరోసారి పోటీ చేయాలని ప్రయత్నించిన సుమలతకు టిక్కెట్‌ ఇవ్వలేదు. పొత్తులో భాగంగా మండ్య స్థానం జేడీఎస్‌కు దక్కింది. దీంతో సుమలత పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. మరో చోట టిక్కెట్‌ ఇస్తామని హామీ ఇచ్చినా ఆమె సిద్ధంగా లేనని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇలా సాగుతుండగానే భవిష్యత్తులోను కలిసి పనిచేసే విషయమై చర్చలు జరిపినట్లు తెలిసింది.

Updated Date - Mar 30 , 2024 | 01:12 PM