Share News

Bharat Jodo Nyay Yatra: మణిపూర్ చేరుకున్న రాహుల్ టీమ్..

ABN , Publish Date - Jan 14 , 2024 | 02:33 PM

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను మణిపూర్ నుంచి శ్రీకారం చుడుతున్నాడు. రాహుల్ గాంధీ సారథ్యంలో చేపడుతున్న ఈ యాత్ర 12 పైగా రాష్ట్రాల మీదుగా రెండు నెలలకు పైగా సాగుతుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఇండిగో విమానాలలో ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ చేరుకున్నారు.

Bharat Jodo Nyay Yatra: మణిపూర్ చేరుకున్న రాహుల్ టీమ్..

ఇంఫాల్: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra)ను మణిపూర్ (Manipur) నుంచి శ్రీకారం చుడుతున్నాడు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలో చేపడుతున్న ఈ యాత్ర 12 పైగా రాష్ట్రాల మీదుగా రెండు నెలలకు పైగా సాగుతుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఇండిగో విమానాలలో ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ చేరుకున్నారు. ఉదయం దట్టమైన మంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరడంలో జాప్యం చోటుచేసుకుంది.


శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, ప్రజలందరికీ న్యాయం అనే సందేశంతో ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తెలిపారు. హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్ నుంచి ఈ చారిత్రక యాత్రను ప్రారంభిస్తున్నామని ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ప్రజలందరికీ న్యాయం చేయడమే రాహుల్ యాత్ర ఉద్దేశమని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. పార్టీకి మిలింద్ దేవరా రాజీనామా చేయడంపై అడిగినప్పుడు, అది చాలా చిన్న విషయమన్నారు. దేశ ప్రజలందరికీ న్యాయం జరగాలని, అది జరగనప్పుడు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.


యాత్ర ఇలా సాగుతుంది...

మణిపూర్‌లోని తౌబల్ జిల్లా మ్యాయ్ మైదాన్‌లో ఉన్న కాంగ్జామ్ అమరవీరుల స్మారకం వద్ద రాహుల్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించడంతో యాత్ర ప్రారంభం కానుంది. ఇంఫాల్‌లోని కొయిరెంగి బజార్ వద్ద 5.30 గంటలకు విరామం ఉంటుంది. అక్కడి కౌజెంగ్లెయిమా స్పోర్ట్ అసోసియేషన్ ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌‌లో రాత్రి బస చేశారు. రాహుల్ తన యాత్రలో భాగంగా డజనుకు పైగా రాష్ట్రాల గుండా 67 రోజుల పాటు 6,700 కిలోమీటర్ల మేర యాత్ర సాగిస్తారు.


మణిపూర్‌లో 100 కిలోమీటర్ల మేర ఒకరోజు పాదయాత్ర జరుగుతుంది. మణిపూర్‌తో పాటు నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లో యాత్ర సాగుతుంది. నాగాలాండ్ (రెండు రోజులు, 257 కిలోమీటర్లు) అరుణాచల్ ప్రదేశ్ (55 కిలోమీటర్లు, ఒకరోజు), మేఘాలయ (5 కిలోమీటర్లు, ఒకరోజు), అసోం (833 కిలోమీటర్లు, 8 రోజులు), అరుణాచల్ ప్రదేశ్ (55 కిలోమీటర్లు, ఒకరోజు), మేఘాలయ (5 కిలోమీటర్లు, ఒకరోజు), అసోం (833 కిలోమీటర్లు, 8 రోజులు) పర్యటన జరుపుతారు. హిందీ రాష్ట్రాలైన బీహార్, జార్ఖాండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, గుజరాత్ లో పర్యటన సాగించి మార్చి 20, 21 తేదీల్లో మహారాష్ట్రలో ముగుస్తుంది. ప్రధానంగా బస్సులోనూ, పాదయాత్ర గానూ ఈ యాత్ర సాగుతుంది. యాత్ర సందర్భంగా ప్రతిరోజూ రాహుల్ రెండు ప్రజాసభల్లో ప్రసంగిస్తారు. వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖీ జరుపుతారు.

Updated Date - Jan 14 , 2024 | 04:43 PM