Share News

Narendra Modi: మహిళల విషయంలో ఆ నేతల ప్రవర్తనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 15 , 2024 | 01:44 PM

డీఎంకే, కాంగ్రెస్‌లకు మహిళలను మోసం చేయడం, అవమానించడం మాత్రమే తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) వ్యాఖ్యానించారు. తమిళనాడు మాజీ సీఎం జయలలితతో డీఎంకే ప్రజలు ఎలా వ్యవహరించారో తమిళనాడు ప్రజలకు తెలుసునని ప్రధాని అన్నారు.

Narendra Modi: మహిళల విషయంలో ఆ నేతల ప్రవర్తనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

డీఎంకే, కాంగ్రెస్‌లకు మహిళలను మోసం చేయడం, అవమానించడం మాత్రమే తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) వ్యాఖ్యానించారు. తమిళనాడు మాజీ సీఎం జయలలితతో డీఎంకే ప్రజలు ఎలా వ్యవహరించారో తమిళనాడు ప్రజలకు తెలుసునని ప్రధాని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు(women reservation bill)ను తీసుకురావడానికి తాము చేపట్టిన చర్యను కూడా డీఎంకే నాయకులు ప్రశ్నించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డీఎంకే, కాంగ్రెస్ మహిళా వ్యతిరేకులని ఆరోపించారు. తమిళనాడు(tamilnadu)లోని కన్యాకుమారి(kanyakumari)లో పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలపై ఈ వ్యాఖ్యలు చేశారు.

1991లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 'ఏక్తా యాత్ర' ప్రారంభించానని మోదీ(modi) తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాజాగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించానని వెల్లడించారు. భారతదేశాన్ని విభజించాలనుకునే వారిని జమ్మూ కాశ్మీర్ ప్రజలు తిరస్కరించారని, తమిళనాడు ప్రజలు కూడా అలాగే చేస్తారని తాను నమ్ముతున్నట్లు మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు నాకు తమిళం(tamil) రాకపోవడం బాధగా ఉందన్నారు. కానీ నాకు తమిళ భాష అంటే చాలా ఇష్టమని చెప్పారు.


ఢిల్లీ(delhi)లో కొత్త పార్లమెంటు భవనంలో తమిళ సంస్కృతికి చిహ్నమైన పవిత్రమైన సెంగోల్‌(sengol)ను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కానీ ఈ వ్యక్తులు దానిని కూడా బహిష్కరించారని, వారు సెంగోల్ స్థాపనను ఇష్టపడలేదని ఆరోపించారు. జల్లికట్టును అత్యంత ఉత్సాహంగా జరుపుకునేందుకు మార్గం సుగమం చేసింది మా ప్రభుత్వమేనని అన్నారు.

తమిళనాడు భవిష్యత్తుకు డీఎంకే మాత్రమే శత్రువు కాదని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో చిదంబరనార్ పోర్టును ప్రారంభించిన తర్వాత మా ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు. ఆధునిక ఫిషింగ్ బోట్‌ల కోసం వారికి ఆర్థిక సహాయం అందించడం నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ పరిధిలోకి తీసుకురావడం వరకు, వారి అవసరాలను తీర్చామని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Stock Markets: 770 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మిడ్ క్యాప్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Updated Date - Mar 15 , 2024 | 01:44 PM