Share News

Droupadi Murmu: రిపబ్లిక్ డే సందర్భంగా జాతీనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ముర్ము

ABN , Publish Date - Jan 25 , 2024 | 09:22 AM

భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక జాతినుద్దేశించి ఆమె ప్రసంగించడం ఇది రెండోసారి.

Droupadi Murmu: రిపబ్లిక్ డే సందర్భంగా జాతీనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ముర్ము

ఢిల్లీ: భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక జాతినుద్దేశించి ఆమె ప్రసంగించడం ఇది రెండోసారి. ఈ సందర్బంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రసంగించే అవకాశం ఉంది. రాష్ట్రపతి సందేశం దేశ ప్రజలను ఏకం చేయడమే కాకుండా దేశ పురోగతికి చిహ్నంగా నిలుస్తుంది.

ఇలా వినండి..

రాష్ట్రపతి ప్రసంగాన్ని టీవీలు, మొబైళ్లలో వీక్షించవచ్చు. గురువారం రాత్రి 09.30 గంటలకు డీడీ న్యూస్ లైవ్ లేదా యూట్యూబ్ లైవ్‌లలో ప్రసంగం మొత్తం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని సిద్ధం అవుతోంది. ఢిల్లీలో జరిగే పరేడ్ కోసం 14 వేల మంది భద్రతా సిబ్బంది మోహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు 77 వేల మందికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి.

Updated Date - Jan 25 , 2024 | 05:05 PM