Share News

Premalatha: మేం ఏ కూటమి వైపో రేపు చెబుతా..

ABN , Publish Date - Mar 20 , 2024 | 10:16 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమిలో చేరాలనే విషయంపై ఈ నెల 21న అధికారికంగా ప్రకటిస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) పేర్కొన్నారు.

Premalatha: మేం ఏ కూటమి వైపో రేపు చెబుతా..

- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమిలో చేరాలనే విషయంపై ఈ నెల 21న అధికారికంగా ప్రకటిస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ తరఫును లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయదలచిన ఆశావహుల నుంచి ఆమె దరఖాస్తులు స్వీకరించారు. ఆ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలనే విషయంపై ఈనెల 21న తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె చెప్పారు.

Updated Date - Mar 20 , 2024 | 10:16 AM