Share News

PM Modi: మీకో పనిష్‌మెంట్ ఇవ్వాలనుంది... 8 మంది ఎంపీలను మోదీ పిలిపించి మరీ..

ABN , Publish Date - Feb 09 , 2024 | 08:08 PM

ప్రధానమంత్రి నుంచి ఊహంచని విధంగా పిలుపు వస్తే ఆ ఆహ్వానం అందుకున్న వారికి ముచ్చెమటలు పట్టడమో, ఆనందంతో ఉక్కరిబిక్కిరి కావడమో సహజం. ఆసక్తికరంగా శుక్రవారం మధ్యాహ్నం ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. 8 మంది ఎంపీలకు పీఎం నుంచి పిలుపువచ్చింది.

PM Modi: మీకో పనిష్‌మెంట్ ఇవ్వాలనుంది... 8 మంది ఎంపీలను మోదీ పిలిపించి మరీ..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నుంచి ఊహంచని విధంగా పిలుపు వస్తే ఆ ఆహ్వానం అందుకున్న వారికి ముచ్చెమటలు పట్టడమో, ఆనందంతో ఉక్కరిబిక్కిరి కావడమో సహజం. ఆసక్తికరంగా శుక్రవారం మధ్యాహ్నం ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి ఓ లుక్కేస్తే...


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వివిధ పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలకు కబురు వచ్చింది. ప్రధాని కలుసుకోవాలనుకుంటారనేది ఆ పిలుపు సారాంశం. దీంతో ఎంపీలు ఆశ్చర్యానికి లోనయ్యారు. లిఫ్ట్ డోర్ ఓపెన్ కావడంతో వారంతా లిఫ్ట్‌ ఎక్కారు. పార్లమెంటు క్యాంటీన్ వద్దకు లిఫ్ట్ చేరుకుంది. ప్రధాని వారిని చూసి చిరునవ్వులు చిందిస్తూ... ''పదండి...మీకో పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను'' అని లంచ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్లారు. ప్రధానితో లంచ్ చేసే అవకాశం వచ్చిందని గ్రహించిన ఎంపీలు సంతోషంగా ఆయనతో కలిసి విందు ఆరగించారు. తన ఫేవరెట్ డిష్ కిచడీ...అని మోదీ చెబుతూ వారికి కూడా అంజేశారు. శాఖాహారంతో పాటు క్యాంటిన్‌లోని రాగి లడ్డూలను ఎంపీలు ఆస్వాదించారు. ''నేను ఎప్పుడూ ప్రధాని మోదీనే కాదు, మీతో కలిసి చక్కటి ఆహారం తీసుకోవాలనుకుంటున్నాను'' అంటూ ఎంపీలను ప్రధాని ఉత్సాహపరిచారు. ఆ సంతోషకరమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ప్రధాని షేర్ చేశారు. ప్రధానితో కలిసి లంచ్ చేసిన ఎంపీలలో బీజేపీ ఎంపీలు హీనా గవిట్, జమ్‌యంగ్ త్సెరింగ్ నంగ్యాల్, కోన్యక్, ఎల్.మురుగన్, టీడీపీ ఎంపీ రామమోహన్ నాయుడు, బీఎస్‌పీ ఎంపీ రితీష్ పాండే, బీజేడీ ఎంపీ సస్మత్ పాత్ర ఉన్నారు.

Updated Date - Feb 09 , 2024 | 08:08 PM