Share News

Rajasthan: ఐసీయూలో చికిత్స పొందుతున్న భార్యకు భర్త ఫోన్.. దారుణం జరిగిపోయిందని ఆమె చెప్పగానే..

ABN , Publish Date - Feb 27 , 2024 | 07:07 PM

రాజస్థాన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మహిళపై అత్యాచారం జరిగింది.

Rajasthan: ఐసీయూలో చికిత్స పొందుతున్న భార్యకు భర్త ఫోన్.. దారుణం జరిగిపోయిందని ఆమె చెప్పగానే..

ఇంటర్నెట్ డెస్క్: ఐసీయూలో ఉన్న భార్య బాగోగులు కనుక్కునేందుకు ఆమె భర్త ఫోన్ చేశాడు. కానీ ఆమె తనపై అత్యాచారం జరిగిందని చెప్పగానే అతడి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. రాజస్థాన్‌లో (Rajasthan) ఆల్వర్ జిల్లాలో ఇటీవల ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 24 ఏళ్ల వివాహిత ఊపిరితిత్తుల సమస్యతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు (Sexual Assault on ICU patient).

Nafe Singh Rathee: కారుపై 40 రౌండ్ల కాల్పులు..INLD చీఫ్, సెక్యూరిటీ గార్డు మృతి


మంగళవారం తెల్లవారుజామున నర్సింగ్ స్టాఫ్‌లో(Nursing Staff) ఒకరై చిరాగ్ యాదవ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. తాను సాయం కోసం అరవబోతే ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడని వాపోయింది. భర్త ఫోన్ చేయడంతో మెళకువ వచ్చిన ఆమె.. జరిగిన దారుణం గురించి అతడికి చెప్పినట్టు పోలీసులు తెలిపారు.

కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ‘‘అతడిని ప్రశ్నిస్తున్నాం. ఐసీయూలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నాం. అతడు బాధితురాలి బెడ్ వద్దకు వెళ్లి అక్కడున్న కర్టెన్లు వేసుకున్న దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది’’ అని పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2024 | 07:15 PM