Share News

Sharad Pawar: శరద్ పవార్ పార్టీకి 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా' గుర్తు

ABN , Publish Date - Feb 23 , 2024 | 09:51 PM

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల గుర్తుగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా' ని కేటాయించింది. ఈ గుర్తుతోనే లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం పోటీ చేయనుంది.

Sharad Pawar: శరద్ పవార్ పార్టీకి 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా' గుర్తు

ముంబై: శరద్ పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీ (NCP-Sharadchandra Pawar)కి ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల గుర్తుగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా' (Man Blowing Turha)ని కేటాయించింది. ఈ గుర్తుతోనే లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం పోటీ చేయనుంది. అజిత్ పవార్ వర్గానిదే నిజమైన ఎన్‌సీపీ అని ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించడంతో పాటు 'గడియారం' గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. పవార్ వర్గాన్ని మూడు పేర్లు సూచించాల్సిందిగా కోరింది. అనంతరం ఫిబ్రవరి 9న శరద్ పవార్ వర్గానికి 'ఎన్సీపీ-శరద్‌చంద్ర పవార్' అనే పేరును కేటాయించింది. తాజాగా పార్టీ గుర్తును కూడా కేటాయిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


కాగా, 'తుర్హా' గుర్తుపై శరద్ పవార్ వర్గం సంతోషం వ్యక్తం చేసింది. వివాహాలు, ఇతర సంతోషకరమైన సందర్భాల్లో దీనిని వాడుతుంటారని, దీనికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉందని చెబుతోంది. శరద్ చంద్ర పవార్ సారథ్యంలో 'తుర్హా' గుర్తుతో ఢిల్లీ సింహాసనాన్ని (కేంద్రాన్ని) కుదిపేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ ఒక ట్వీట్‌ చేసింది.

Updated Date - Feb 23 , 2024 | 09:51 PM