Share News

Mahadev App: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. రూ.580 కోట్లు స్తంభింపజేసిన ఈడీ

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:10 PM

ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ, ముంబయి. కోల్‌కతాలలో దాడులు నిర్వహించిన ఈడీ యాప్‌ ప్రమోటర్‌కి చెందిన రూ.580 కోట్లు స్తంభింపజేసింది.

Mahadev App: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. రూ.580 కోట్లు స్తంభింపజేసిన ఈడీ

ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ, ముంబయి. కోల్‌కతాలలో దాడులు నిర్వహించిన ఈడీ యాప్‌ ప్రమోటర్‌కి చెందిన రూ.580 కోట్లు స్తంభింపజేసింది. ఏడాదికిపైగా ఈ విచారణ కొనసాగుతుండగా.. బెట్టింగ్ యాప్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటివరకు దాదాపు రూ.1200 కోట్లకుపైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. 9 మందిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 28న కోల్‌కతా, గురుగ్రామ్, ఢిల్లీ, ఇండోర్, ముంబయి, రాయ్‌పుర్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో రూ.1.86 కోట్ల విలువైన నగదు, రూ.1.78 కోట్ల విలువైన వస్తువులను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన టిబ్రేవాల్ అనే వ్యక్తి దుబాయ్‌లో ఉంటున్నట్లు ఈడీ తెలిపింది.


అతను మహాదేవ్ యాప్ ప్రమోటర్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు ఈడీ(ED) పేర్కొంది. ఆయనకు చెందిన రూ.580 కోట్ల విలువైన సెక్యూరిటీ హోల్డింగ్‌లను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద స్తంభింపజేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

ఈ యాప్ ద్వారా వచ్చిన అక్రమ నిధుల్ని ఛత్తీస్‌గఢ్‌లోని రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్‌లకు లంచాలు చెల్లించడానికి ఉపయోగించారని ఈడీ ఆరోపిస్తోంది. యాప్ ప్రధాన ప్రమోటర్లుగా సౌరభ్ చంద్రకార్, రవి ఉన్నారు. ఈ నేర సామ్రాజ్యం అక్రమ ఆదాయం మొత్తం రూ.6 వేల కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2024 | 04:12 PM