Share News

Lok Sabha Elections: జేకేలో కాంగ్రెస్, ఎన్‌సీ మధ్య కుదిరిన డీల్

ABN , Publish Date - Apr 08 , 2024 | 05:47 PM

జమ్మూకశ్మీర్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్సె, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. సీట్ల పంపకాలు ఖరారైనట్టు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోమవారంనాడు ప్రకటించారు. పొత్తులో భాగంగా జమ్మూకశ్మీర్, లడఖ్‌లో చెరో 3 సీట్లలో ఎన్‌సీ, కాంగ్రెస్ పోటీ చేయనుట్టు తెలిపారు.

Lok Sabha Elections: జేకేలో కాంగ్రెస్, ఎన్‌సీ మధ్య కుదిరిన డీల్

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) నేషనల్ కాన్ఫరెన్సె (NC), కాంగ్రెస్ (Congress) మధ్య పొత్తు కుదిరింది. సీట్ల పంపకాలు ఖరారైనట్టు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సోమవారంనాడు ప్రకటించారు. పొత్తులో భాగంగా జమ్మూకశ్మీర్, లడఖ్‌లో చెరో 3 సీట్లలో ఎన్‌సీ, కాంగ్రెస్ పోటీ చేయనుట్టు తెలిపారు.

Lok Sabha Elections: బీజేపీకి ఎదురుదెబ్బ.. కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ రాజీనామా


ఉదంపూర్, జమ్మూ, లఢక్ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారని, అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లాలో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తుందని ఒమర్ ప్రకటించారు. తాము కలిసికట్టుగా 6 సీట్లు గెలుచుకునేందుకు పనిచేస్తామని చెప్పారు. పీడీపీకి సీట్ల షేరింగ్ విషయంలో దూరంగా జరగడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, గరిష్టంగా 6 సీట్లు మాత్రమే ఉన్న రాష్ట్రంలో కానీ ప్రాంతంలో కానీ ఇచ్చిపుచ్చుకునేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. అందులోనూ 3 సీట్లు ఎన్‌సీకే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, ఎన్‌సీ చెరో 3 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి ఆప్షన్లు వారికి ఉంటాయని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి 27కు పైగా పార్టీలతో ఏర్పడిన 'ఇండియా' కూటమిలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ భాగస్వాములుగా ఉన్నాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 05:49 PM