Share News

Congress Manifesto Live Updates: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై వరాల జల్లు..

ABN , First Publish Date - Apr 05 , 2024 | 11:55 AM

Congress Manifesto 2024:: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. 5 న్యాయ పథకాలు, 25 హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖ నేతలంతా పాల్గొన్నారు.

Congress Manifesto Live Updates: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై వరాల జల్లు..
Congress Manifesto

Live News & Update

  • 2024-04-05T12:51:27+05:30

    బీజేపీ చేతిలో సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు ఉన్నాయి: రాహుల్‌

    • కేంద్రసంస్థలతో బెదిరించి నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారు.

    • కేంద్రసంస్థలను ప్రయోగించి పార్టీకి నిధులు సమకూర్చుకుంటున్నారు.

    • ఆర్థికంగా బీజేపీ తమను తాము పరిపుష్టం చేసుకున్నారు.

    • బీజేపీ మేనిఫెస్టోలో 1-2% ఉన్న అదానీ వంటివారు కోరుకున్నవి ఉంటాయి.

    • మా మేనిఫెస్టోలో మాత్రం మిగతా 98-99% ప్రజలు కోరుకునేవి ఉన్నాయి.

    • ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేవారికి.. కాపాడేవారికి మధ్య పోరాటం.

    • నాలుగు పెద్ద కార్పొరేట్ సంస్థల కోసం దేశం కాదు.

    • వ్యాపారస్తుల మధ్య పారదర్శక పోటీ ఉండేలా చూస్తాం.

    • కాంగ్రెస్ గ్యారంటీలంటే.. కాంక్రీట్ గ్యారంటీలే.

  • 2024-04-05T12:50:13+05:30

    MS స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులకు కనీస మద్దతు ధర: ఖర్గే

    • నూతన వ్యవసాయ చట్టాలను అధికారం రాగానే తీసేస్తాం.

    • మన రేగా రోజు వారి వేతనం 400 వందలకు పెంపు.

    • సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ మూడేళ్లలో పూర్తి చేస్తాం.

    • నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తాం.

    • వ్యవసాయ పరికరాలపై GST మినహాయింపు.

    • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు.

    • SC, ST, BC విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ రెట్టింపు.

    • SC, ST, BCలకు రిజర్వ్‌ చేసిన పోస్టులను ఏడాదిలో భర్తీ చేస్తాం.

    • సామాజిక న్యాయం కింద పింఛన్‌ రూ.1000కి పెంపు.

    • వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్‌ పెంపు.

    • ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.400కు పెంపు.

  • 2024-04-05T12:22:37+05:30

    కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాహుల్ గాంధీ ట్వీట్..

  • 2024-04-05T12:21:23+05:30

    కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో...

    • ఎం.ఎస్ స్వామినాథన్ సిఫారసు మేరకు రైతులకు కనీస మద్దతు ధర.

    • ఎంఎస్ పి డైరెక్ట్‌గా రైతులకు కేంద్రాలలో ఇస్తాము.

    • రైతు రుణాలకు ప్రత్యేక కమిషన్.

    • నూతన వ్యవసాయ చట్టాలను అధికారం రాగానే తీసేస్తాం.

    • మన రేగా రోజు వారి వేతనం 400 వందలకు పెంపు.

    • పట్టణాలలో అర్బన్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం.

    • సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఖాళీల భర్తీ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం.

    • నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు.

  • 2024-04-05T12:14:37+05:30

    కాంగ్రెస్‌ గతంలో చేసిన అభివృద్ధినే కొనసాగిస్తాం: ఖర్గే

    👉 పేద మహిళలకు ఏడాదికి రూ. లక్ష అందిస్తాం.

    👉 కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం.

    👉 కిసాన్‌ న్యాయ్‌ పేరుతో రైతులను ఆదుకుంటాం.

    👉 పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకువస్తాం.

    👉 రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేస్తాం.

    👉 విద్యార్థులకు రూ.లక్ష ఆర్థికసాయం చేస్తాం.

  • 2024-04-05T12:12:32+05:30

    పదేళ్లలో జీడీపీ వృద్ధిరేటు 5.8 శాతంగానే ఉంది: చిదంబరం

    👉 రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత, పెట్రో ధరల తగ్గింపు చర్యలు.

    👉 50 శాతం రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత.

    👉 సంపన్నుల కోసమే మోదీ సర్కార్‌ పనిచేస్తోంది.

    👉 మోదీ పాలనలో ప్రజాస్వామ్యం బలహీనపడింది.

    👉 ఒక్క శాతం ఉన్న ధనికుల కోసమే బీజేపీ ప్రభుత్వం పాలన చేస్తుంది.

    👉 నిరుపేదలను మోదీ సర్కార్‌ పట్టించుకోలేదు.

  • 2024-04-05T12:11:07+05:30

    గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు: చిదంబరం

    • దేశంలోని అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది.

    • ధరలు పెరిగాయి.. నిరుద్యోగిత పెరిగిపోయింది.

    • వృద్ధిరేటు పెరగలేదు, ఐదేళ్లుగా వేతనాలు కూడా పెరగలేదు.

    • యూపీఏ హయాంలో 7.8 శాతం వృద్ధిరేటు నమోదైంది.

    • దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం.

    • 30 లక్షల ఉద్యోగాల కల్పన, రూ.5 వేల కోట్లతో యువతకు స్టార్టప్‌ ఫండ్‌.

    • రూ.450కే వంట గ్యాస్‌ సిలింబర్‌ పంపిణీ.

  • 2024-04-05T12:07:39+05:30

    గదిలో కూర్చొని రూపొందించింది కాదు..

    కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆ పార్టీ నాయకురాలు అల్కా లాంబా మాట్లాడారు. ఇది ‘న్యాయ్ పత్ర’ అని అన్నారు. తలుపులు మూసి ఉన్న గదుల్లో కూర్చొని చేయలేదని, ‘భారత్ జోడో యాత్ర’, భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రజల పరిస్థితిని చూసి రూపొందించిన మేనిఫెస్టో అని పేర్కొన్నారు.

  • 2024-04-05T12:04:08+05:30

    కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో...

    👉 దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తో హాస్పిటల్ ఏర్పాటు.

    👉 యూనివర్సిటీలో వివక్షకు గురవుతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు రోహిత్ వేముల ఆక్ట్ అమలు చేస్తాం.

    👉 వెనకబడిన పేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం.. బ్యాంకు అకౌంట్‌లో వెస్తాము.

    👉 ప్రభుత్వ ఉద్యోగాలలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్.

    👉 దేశవ్యాప్తంగా నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, కస్తూర్బా గాంధీ పాఠశాల పాఠశాలల పెంపు,

  • 2024-04-05T11:58:51+05:30

    కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

    • మేనిఫెస్టో విడుదల చేసిన ఖర్గే, సోనియా, రాహుల్‌

    • న్యాయ్‌పత్ర-2024 పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

    • 5 న్యాయ పథకాలు, 25 హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

    • 48 పేజీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసిన అగ్రనేతలు

  • 2024-04-05T11:50:21+05:30

    Congress Manifesto 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. 5 న్యాయ పథకాలు, 25 హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖ నేతలంతా పాల్గొన్నారు.