Share News

Mumbai: ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య!

ABN , Publish Date - Jun 03 , 2024 | 07:12 PM

మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ దంపతుల కుమార్తె లిపి (27) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. చదువుల కారణంగా ఒత్తిడికి లోనవుతున్న ఆమె అపార్ట్‌మెంట్ పదవ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.

Mumbai: ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య!

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర (Maharashtra) కేడర్ ఐఏఎస్ దంపతుల కుమార్తె లిపి (27) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. చదువుల కారణంగా ఒత్తిడికి లోనవుతున్న ఆమె అపార్ట్‌మెంట్ పదవ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయానికి సమీపంలోగల సురుచి అపార్ట్‌మెంట్‌లో తెల్లవారుజమామున ఈ ఘటన జరిగింది. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

Cricket: క్రికెట్‌లో విషాదం.. సిక్స్ కొట్టిన తర్వాత ప్రాణం విడిచిన క్రికెటర్


లిపి హర్యానాలో ఎల్ఎల్‌బీ కోర్సు చదువుతున్నారు. ఆమె తండ్రి మహారాష్ట్ర ప్రభుత్వ హైయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నారు. మృతురాలి తల్లి రాధిక రస్తోగీ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారిణి. లిపి తన చదువు గురించి ఆందోళనతో ఉండేవారని పోలీసులు తెలిపారు. చివరకు ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిందన్నారు. పోలీసులకు ఆమె సూసైడ్ నోట్ కూడా లభించింది. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని ఆమె సూసైడ్ నోట్ లో రాసారు.

కాగా, 2017లో మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ దంపతులు మిలింద్, మనీషా మహైస్కార్‌ల 18 ఏళ్ల కుమారుడు ఎత్తైన అపార్ట్‌మెంట్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read Latest National and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 07:25 PM