Lok Sabha Elections: బీజేపీలో చేరిన మాజీ సీఎం భార్య
ABN , Publish Date - Feb 26 , 2024 | 02:37 PM
లోక్సభ ఎన్నికల ముంగిట కీలక పార్టీలో నేతల వలసలు కొనసాగుతున్నాయి. జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడ భార్య, సింగ్భూమ్ కాంగ్రెస్ ఎంపీ గీతా కోడ సోమవారంనాడు బీజేపీలో చేరారు. జార్ఖఆండ్ బీజేపీ చీఫ్ బాబూలాల్ మరాండి సమక్షంలో పార్టీ కార్యాలయంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.
![Lok Sabha Elections: బీజేపీలో చేరిన మాజీ సీఎం భార్య](https://media.andhrajyothy.com/media/2024/20240224/geeta_6bfdf9c71c.jpg)
రాంచీ: లోక్సభ ఎన్నికల ముంగిట కీలక పార్టీలో నేతల వలసలు కొనసాగుతున్నాయి. జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడ (Madhu Koda) భార్య, సింగ్భూమ్ (Singhbhum) కాంగ్రెస్ ఎంపీ గీతా కోడ (Geeta Koda) సోమవారంనాడు బీజేపీలో చేరారు. జార్ఖఆండ్ బీజేపీ చీఫ్ బాబూలాల్ మరాండి సమక్షంలో పార్టీ కార్యాలయంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పొత్తులపై గీతా కోడ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె తన రాజీనామాను పార్టీ అధిష్ఠానానికి పంపారు. లోక్సభ ఎన్నికల సమయంలో గీతా కోడ పార్టీ మారడం కాంగ్రెస్కు దెబ్బగా భావిస్తున్నారు.