Share News

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. లోక్‌సభ ఎన్నికలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు

ABN , Publish Date - Jan 26 , 2024 | 12:35 PM

లోక్‌సభ ఎన్నికలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Former Chief Minister Basavaraja Bommai) చెప్పారు.

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. లోక్‌సభ ఎన్నికలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు

- మాజీ ముఖ్యమంత్రి బొమ్మై

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Former Chief Minister Basavaraja Bommai) చెప్పారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగదీష్‌ శెట్టర్‌ తిరిగి బీజేపీలో చేరడాన్ని స్వాగతించారు. ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆవేదనకు గురై ఆయన కాంగ్రెస్‏లో చేరారని, అంతేగానీ ఆ పార్టీపై అభిమానంతో కాదన్నారు. జనసంఘ్‌ కాలం నుంచి తాను జగదీష్‌ శెట్టర్‌ను చాలా దగ్గరగా చూస్తున్నానన్నారు. కాంగ్రెస్‌ డీఎన్‌ఏ శెట్టర్‌కు సరిపోదన్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరినా మనస్సు మాత్రం బీజేపీ(BJP)తోనే ఉందన్నారు. పలు కారణాలతో శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ వీడిన నేతలంతా తిరిగి సొంతగూటికి చేరుకోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ కు చెందిన పలువురు కీలక నేతలు కూడా బీజేపీలో చేరతారన్నారు. బీజేపీ ఒక కులానికో మతానికో పరిమితం కాదన్నారు. ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ(Narendra Modi) ప్రధాని కావడం ఖాయమన్నారు.

Updated Date - Jan 26 , 2024 | 12:35 PM