Share News

DA, DR Hike In March: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వచ్చే నెలలోనే..

ABN , Publish Date - Feb 24 , 2024 | 09:54 PM

DA, DR Hike In March: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Government Employees) త్వరలో శుభవార్త వినబోతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)(DA) మార్చిలో 4 శాతం పెరగనుంది. ఈ పెంపు తరువాత డీఆర్(DR), డీఏ(DA) 50 శాతానికి పైగా చేరుకుంటుంది. సీపీఐ డేటా ఆధారంగా డీఏ, డీఆర్ ఎంత పెంచాలనేది..

DA, DR Hike In March: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వచ్చే నెలలోనే..
DA, DR Hike In March

DA, DR Hike In March: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Government Employees) త్వరలో శుభవార్త వినబోతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)(DA) మార్చిలో 4 శాతం పెరగనుంది. ఈ పెంపు తరువాత డీఆర్(DR), డీఏ(DA) 50 శాతానికి పైగా చేరుకుంటుంది. సీపీఐ డేటా ఆధారంగా డీఏ, డీఆర్ ఎంత పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం(Government of India) నిర్ణయిస్తుంది. డీఏ మూల వేతనంలో 50.25 శాతానికి సమానంగా ఉంటుంది. ప్రతి నెల సీపీఐ-ఐడబ్ల్యూ డేటాను కార్మిక మంత్రిత్వ శాఖ విభాగమైన లేబర్ బ్యూరో విడుదల చేస్తుంది.

ప్రతి నెల, CPI-IW డేటాను కార్మిక మంత్రిత్వ శాఖ యొక్క విభాగమైన లేబర్ బ్యూరో విడుదల చేస్తుంది. డీఏ ఉద్యోగులకు ఇవ్వనుండగా.. డీఆర్ పెన్షనర్లకు చెల్లిస్తారు. డీఏ, డీఆర్‌ను సంవత్సరానికి రెండుసార్లు జనవరి, జులైలో ప్రకటిస్తారు. గతేడాది అక్టోబరులో DA 4 శాతం పెంచారు. దాంతో అదికాస్తా 46 శాతానికి పెరిగింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా తదుపరి డీఏ పెంపు 4 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పెంచే డీఏ జనవరి 1, 2024 నుంచి అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం అందుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2024 | 09:54 PM