Share News

Covid: స్వల్పగా పెరిగిన ‘కరోనా’.. 163 మందికి పాజిటివ్‌

ABN , Publish Date - Jan 13 , 2024 | 11:38 AM

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 163 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 162 మంది డిశ్చార్జి అయ్యారు.

Covid: స్వల్పగా పెరిగిన ‘కరోనా’.. 163 మందికి పాజిటివ్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 163 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 162 మంది డిశ్చార్జి అయ్యారు. బెంగళూరులో 50 మంది, మైసూరు లో 27, హాసన్‌లో 10 మందికి ప్రబలగా మిగిలిన జిల్లాలో పదిలోపు కేసులు నమోదయ్యాయి. 994 మంది చికిత్సలు పొందుతున్నారు. కాగా, కొవిడ్‌ మృతుల అంత్యక్రియలు జరిపేలా వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని నగరపాలక, పురపాలక, మహానగర పాలికెలతో పాటు గ్రామ పంచాయతీల పరిధిలోని స్మశాన వాటికలలో అమలు చేసేలా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jan 13 , 2024 | 11:38 AM