Share News

Covid: పెరుగుతున్న ‘కరోనా’.. 201 మందికి పాజిటివ్‌

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:38 PM

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బుధవారం 201మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరు(Bangalore)లో 121, తుమకూరులో 14, మైసూరులో 10మందికి కాగా

Covid: పెరుగుతున్న ‘కరోనా’.. 201 మందికి పాజిటివ్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బుధవారం 201మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరు(Bangalore)లో 121, తుమకూరులో 14, మైసూరులో 10మందికి కాగా మిగిలిన జిల్లాల్లో అంతకులోపు కేసులు నమోదయ్యాయి. 257మంది డిశ్చార్జ్‌ కాగా ఒకరు మృతి చెందారు. 974మంది చికిత్సలు పొందుతున్నారు. కాగా కొత్త వేరియంట్‌తో పెరుగుతున్న కేసులతో ఆందోళన వద్దని వైద్యులు అంటున్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:38 PM