Share News

Chennai: ఇదేం శాపం.. నేను మాట్లాడేటప్పుడు లేచివెళ్తే రక్తం కక్కుకుని చస్తారు!

ABN , Publish Date - Mar 29 , 2024 | 09:53 AM

మదురై లోక్‌సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా డాక్టర్‌ శరవణన్‌ పోటీ చేస్తున్నారు. ఆయన పరిచయ కార్యక్రమం బుధవారం సెల్లూరు ప్రాంతంలో జరిగింది.

Chennai: ఇదేం శాపం.. నేను మాట్లాడేటప్పుడు లేచివెళ్తే రక్తం కక్కుకుని చస్తారు!

- అన్నాడీఎంకే మాజీ మంత్రి సెల్లూర్‌ రాజు

చెన్నై: మదురై లోక్‌సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా డాక్టర్‌ శరవణన్‌ పోటీ చేస్తున్నారు. ఆయన పరిచయ కార్యక్రమం బుధవారం సెల్లూరు ప్రాంతంలో జరిగింది. ఈ సభలో మాజీ మంత్రి సెల్లూరు కె.రాజు(Former minister Selluru K. Raju) మాట్లాడుతూ... ‘‘ఎందుకురా బాబూ ఈ మీటింగ్‌లో కూర్చొబెట్టారు అనుకొని లేచేందుకు ఎవ్వరూ ప్రయత్నించవద్దు. అందురూ కూర్చొనే ఉండాలి... ఒకవేళ నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా లేచివెళ్తే రక్తం కక్కుకుని చస్తారు’’ అంటూ సినిమాల్లో వడివేలు తరహాలో సరదాగా శాపనార్థాలు పెట్టారు. అలాగే, సిలిండర్‌ ధర రూ.500 తగ్గిస్తామన్న డీఎంకే ప్రకటనను ప్రజలు నమ్మడం లేదని సెల్లూరు రాజు వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో కూడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - Mar 29 , 2024 | 09:53 AM