Share News

Chennai: కొండెక్కిన కొత్తిమీర.. అమాంతం పెరిగిన ధర.. కట్ట రూ.100

ABN , Publish Date - May 30 , 2024 | 12:57 PM

హోసూరు ప్రాంతంలో రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. స్థానికంగా పండించే పంటలు తమిళనాడుకే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌(Kerala, Karnataka, Andhra Pradesh)కు కూడా ఎగుమతి అవుతుంటాయి.

Chennai: కొండెక్కిన కొత్తిమీర.. అమాంతం పెరిగిన ధర.. కట్ట రూ.100

హోసూరు(చెన్నై): హోసూరు ప్రాంతంలో రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. స్థానికంగా పండించే పంటలు తమిళనాడుకే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌(Kerala, Karnataka, Andhra Pradesh)కు కూడా ఎగుమతి అవుతుంటాయి. స్థానికంగా సుమారు రెండువేల ఎకరాలకు పైగా కొత్తిమీర పంట సాగు చేస్తున్నారు. కొన్ని రోజులుగా కొత్తిమీర ధరలు పెరిగాయి. పంట దెబ్బతినడమే ధర పెరగడానికి కారణమని తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: Chennai: నిప్పుల కొలిమిలా చెన్నై నగరం.. తీవ్రమైన సెగతో అల్లాడిన జనం


శూలగిరి, రాయకోట, తళి, అంచెట్టి, బాగలూరు, బేరికై, డెంకణీకోటతో సహ వివిధ ప్రాంతాల నుంచి హోసూరు, శూలగిరి రాయకోట సహా మార్కెట్లకు కొత్తిమీర రావడం తగ్గింది. ఎకరా కొత్తిమీర రూ.4.5 లక్షలకు అమ్ముడు పోతోంది. హోసూరు మార్కెట్‌లో ప్రస్తుతం ఒక కట్ట కొత్తిమీర రూ.90 నుంచి రూ.100 వరకు పలుకుతుంది. ఇటీవల వరకు రూ.5 నుంచి రూ.10 వరకు పలికిన కొత్తిమీర కట్ట ఒక్కసారిగా వందకు చేరింది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 30 , 2024 | 12:57 PM