Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Aug 09 , 2024 | 07:15 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-08-09T14:00:32+05:30

    కవిత 11 కిలోల బరువు తగ్గింది: కేటీఆర్

    • హైదరాబాద్: కవిత జైలులో చాలా ఇబ్బందులు పడుతుంది.

    • ఇప్పటి వరకు 11 కిలోలు తగ్గింది.

    • బీపీ వచ్చింది. దాంతో రోజు రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది.

    • సిసోడియాకు బెయిల్ అంశం అనేది ఆలోచించి మాట్లాడాలి.

    • రాజకీయంగా పోరాడాల్సి వచ్చిన సమయంలో ఇలాంటివి తప్పవు.

    • కవిత బెయిల్ కోసం నిన్న అప్పీల్ చేశాం.

    • నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం ఉందని భాభిస్తున్నాం.

    • సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు వస్తుందని భాభిస్తున్నాం.

    • ఖైదీలు 11 వేలు ఉండాల్సిన చోట 30 వేల మంది ఉన్నారు.

    • జైలు పరిశుభ్రంగా లేదు.

    • జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు భవిష్యత్‌తో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది: కేటీఆర్

      ktr-new.jpg

  • 2024-08-09T13:52:10+05:30

    రంగంలోకి సాల్వే..

    • వినేశ్ ఫోగట్ కేసును సీఏఎస్ కోర్టులో వాదించనున్న హరీశ్ సాల్వే

    • హరీశ్ సాల్వే రంగంలోకి దిగడంతో మెడల్‌పై ఆశలు

    • దేశంలో ప్రముఖ న్యాయవాదిగా హరీశ్ సాల్వేకు గుర్తింపు

    • గతంలో కుల్‌భూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో వాదించిన సాల్వే

    • జాదవ్‌కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది.

    • రాజ్యాంగం, కమర్షియల్ టాక్స్ గురించి సాల్వేకు మంచి పట్టు ఉంది.

      harish-salve.jpg

  • 2024-08-09T13:35:54+05:30

    సీతారామాపురంలో జగన్

    • నంద్యాల: మహనంది మండలం సీతారామాపురం చేరుకున్న మాజీ సీఎం జగన్

    • ఇటీవల హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్.

  • 2024-08-09T13:31:21+05:30

    గిరిజనులు ఎక్కువ ఉండే దేశం మనది: ఏపీ సీఎం చంద్రబాబు

    • అమరావతి: రాష్ట్రపతిగా ద్రౌపతి మర్ము ఉండటం మనందరికీ గర్వకారణం: ఏపీ సీఎం చంద్రబాబు

    • ఆఫ్రికా తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉండే దేశం మనది

    • రాష్ట్రంలో 27 లక్షల మంది ఆదివాసులు ఉన్నారు

    • 5 శాతం ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారు

    • గురువు లేకుండా విలు విద్యను నేర్చుకున్న ఆదర్శవంతుడు ఏకలవ్యుడు

    • గిరిజనులకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఏకలవ్యుడు

    • గిరిజనులు పండించే కాఫీకి నేను ఎంతో ప్రాధాన్యత ఇచ్చాను

    • అరకు కాఫీ అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది

    • అరకు కాఫీకి ప్రధాని నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్

    • మైదానంలో నివసించే గిరిజనులు అందరికంటే వెనుకబడి ఉన్నారు

    • ఆదివాసి దినోత్సవం జరపాలని 2018లో జీవో జారీ చేశా: సీఎం చంద్రబాబు

      Chandrababu.jpg

  • 2024-08-09T13:25:24+05:30

    • అలర్ట్‌గా ఉన్నాం: తెలంగాణ డీజీపీ

    • హైదరాబాద్: బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించిన తెలంగాణ డీజీపీ

    • బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో నిఘా పెట్టాం

    • సిటీలో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచాం

    • హైదరాబాద్‌కి అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాం

    • కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటాం

    • ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది

  • 2024-08-09T12:44:25+05:30

    వయనాడు విధ్వంసం

    • వయనాడు పునరుద్ధరణకు సెలబ్రిటీల విరాళం

    • ముందుకొచ్చిన 13 ఏళ్ల బాలిక

    • 3 గంటలపాటు ఏకధాటిగా భరతనాట్యం

    • రూ.15 వేలు సేకరించి, సీఎం పినరయి విజయన్‌కు అందజేత

    • మిగతావారికి ఆదర్శంగా నిలిచిన బాలిక

      kerala-girl.jpg

  • 2024-08-09T12:36:27+05:30

    వైసీపీ విగ్రహ రాజకీయం

    • అమరావతి: విజయవాడలో వైసీపీ విగ్రహ రాజకీయం

    • స్వరాజ్ మైదాన్ అంబేద్కర్ న్యాయ మహాశిల్పంలో మాజీ సీఎం జగన్ పేరును తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు

    • ఎత్తైన విగ్రహంతోపాటు పెద్ద అక్షరాలతో జగన్ పేరు

    • ఆ పేరును గత రాత్రి తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు

    • జగన్ పేరును టీడీపీ తొలగించిందని బ్లూ మీడియా తెగ హడావుడి

    • తమకు సంబంధం లేదంటున్న టీడీపీ నేతలు

    • అంబేద్కర్ విగ్రహం తొలగించినట్టు వైసీపీ సొంత మీడియా హడావిడి.. టీడీపీ ఆగ్రహం

  • 2024-08-09T12:32:01+05:30

    సైబర్ నేరగాళ్ల బాధితులు ఎక్కువమంది చదువుకున్న వారే..

    • ప్రజల సేఫ్టీకి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది: డీజీపీ జితేందర్

    • తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా చాలా కేసులు పరిష్కారం

    • ఏడాదిలో సైబర్ క్రైమ్ వల్ల డబులు కోల్పోయిన బాధితులకు రూ.150 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పించింది

    • హకథాన్‌లో దేశ, విదేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారు

    • చదువుకున్న వాళ్ళే సైబర్ క్రైమ్ వేధింపులకు గురవుతున్నారు: సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్

    • 70 శాతం సైబర్ క్రైమ్ బాధితులు చదువుకున్న వాళ్ళే

    • ఐటీ ఉద్యోగులే 56 శాతం సైబర్ క్రైమ్ బాధితులుగా ఉన్నారు

    • నిమిషానికి రెండు సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవుతున్నాయి: ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రటరీ భావేశ్ మిశ్రా

    • సైబర్ క్రైమ్ వేధింపులకు గురైనా కంప్లెయింట్ చేయడం లేదు

    • గతేడాది సైబర్ క్రైమ్ వల్ల 7,500 కోట్ల రూపాయలు లాస్ అయ్యారు.

      cyber crime.jpg

  • 2024-08-09T12:12:51+05:30

    నో బెయిల్..!!

    • అమరావతి: సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురు

    • ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు ధర్మాసనం

    • రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు

    • తదుపరి విచారణ ఈ నెల20కి వాయిదా

    • రఘురామకు కస్టోడియల్‌లో గాయాలైనట్టు సుప్రీంకోర్టు అభిప్రాయ పడిందనే వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు

    • మధ్యంతర ముందస్తు బయిల్ ఇవ్వటానికి నిరాకరణ

  • 2024-08-09T12:03:45+05:30

    చంద్రబాబు వల్లే ఏపీకి పరిశ్రమలు

    • కర్నూలు: సీబీఎన్ అనే బ్రాండ్‌తో ఏపీకి పరిశ్రమలు: మంత్రి టీజీ భరత్

    • గత ప్రభుత్వం డెస్టాయ్ తప్ప మరేమీ చేయలేదు

    • ఓర్వకల్లు రెడ్ జోన్‌లో ఉంది. అన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటుకి అనుకూలం

    • టీడీపీ అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి

    • జయరాజ్ స్టీల్ ప్లాంట్‌కు వైసీపీ ప్రభుత్వం సహకారం అందించలేదు.

  • 2024-08-09T11:58:59+05:30

    గిరిజనుల అభివృద్ధి కోసం..

    • అమరావతి: గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారు:మంత్రి గుమ్మడి సంధ్యారాణి

    • ఐటీడీఏ ఏర్పాటైన తర్వాత గిరిజన సోదరులు, మహిళలు ఎలా ఉండాలనేది తెలిసింది

    • సజ్జలు, జొన్నలు, రాగులు లాంటి చిరుధాన్యాలు మాత్రమే గిరిజనులు తీసుకునేవారు.

    • రూ.2 కిలో బియ్యం ఇచ్చి వరి భోజనం పరిచయం చేసింది నందమూరి తారక రామారావు

    • గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థల్ని జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు

    • రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది గిరిజనులు ఇబ్బంది పడ్డారు

    • గిరిజనుల అభివృద్ధి కోసం లక్ష పాతికవేల ఎకరాలు ఇచ్చారు

    • గిరిజనులకు ఇచ్చిన భూముల్లో దళారులతో వైసీపీ నాయకులు గంజాయి పండించారు

    • గిరిజన పిల్లలను ప్రేరేపించి గంజాయి రవాణా కోసం వాడుకున్నారు

    • 70 శాతం మంది గిరిజన పిల్లలు జైల్లో మగ్గిపోతున్నారు.

    • గంజాయి సూత్రధారులు మాత్రం బయటే ఉన్నారు: మంత్రి గుమ్మడి సంధ్యారాణి

  • 2024-08-09T11:33:28+05:30

    గిరిజనుల తేనె కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు

    • అమరావతి: ఆదివాసీల జీవనశైలికి సంబంధించిన పనిముట్లతో ప్రదర్శన

    • ఆసక్తిగా తిలకించిన ఏపీ సీఎం చంద్రబాబు

    • ఉత్పత్తులు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు

    • అడవి నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎక్కువ డిమాండ్ ఉంది

    • గిరిజనుల తేనె కొనుగోలు చేసిన చంద్రబాబు

    • గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి: సీఎం చంద్రబాబు

      CM-Chandrababu-Naidu.jpg

  • 2024-08-09T11:26:05+05:30

    డప్పుకొట్టిన ఏపీ సీఎం చంద్రబాబు

    • అమరావతి: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

    • ఆదివాసి దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి

    • గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్న కళాకారులు

    • డప్పు తీసుకుని వాయించిన సీఎం చంద్రబాబు

    • గిరిజన, లంబాడి కళాకారులతో ముచ్చటించిన చంద్రబాబు

    • గిరిజన సంప్రదాయం కొమ్మ కోయ ధరించి కళాకారులతో జత కలిసిన చంద్రబాబు

    • గిరిజనలు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు

    • గిరిజనులు తయారు చేసిన కాఫీ తాగిన చంద్రబాబు

    • ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, అధికారులతో కాఫీ తాగించిన చంద్రబాబు

      chandrababu-white-paper.jpg

  • 2024-08-09T11:20:33+05:30

    కేటీఆర్ కామెంట్స్

    • హైదరాబాద్: ప్రభుత్వ నిర్ణయం వల్ల హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం: కేటీఆర్

    • సుంకేసుల పంపు హౌస్ విషయంలో జరిగిన అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

    • హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టు స్టార్ట్

    • ప్రాజెక్టు కోసం అప్పట్లో నల్లగొండ జిల్లాలో ఘర్షణలు.

    • చంద్రబాబు నాయుడు హయాంలో ఎలిమినేటి మాధవ రెడ్డి పేరుతో ప్రారంభం

    • రాజశేఖర్ రెడ్డి హయాంలో పేజ్ 1, పేజ్ 2 పేరుతో ప్రారంభం

    • ప్రజల అభిప్రాయం తీసుకున్న తరువాత సుంకేసుల ప్రాజెక్ట్‌ను కేసీఆర్ రీ స్టార్ట్ చేశారు.

    • నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజ్ ఉన్న హైదరాబాద్‌కు మంచి నీటి సరఫరా కోసం తీర్చిదిద్దాం.

      ktr-brs.jpg

  • 2024-08-09T11:14:43+05:30

    డయాలసిస్ యూనిట్లు ప్రారంభం

    • నెల్లూరు: జీజీహెచ్‌లో డయాలసిస్ యూనిట్లు ప్రారంభించిన మంత్రి సత్యకుమార్

    • లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆరు డయాలసిస్ యూనిట్లు ఇవ్వడం ఆనందంగా ఉంది.

    • ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

    • మెరుగైన వైద్యం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది.

    • దేశంలో రూ.3.40 కోట్ల మంది కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

    • గత ఐదేళ్లలో వైద్య రంగాన్ని వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసింది: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్

  • 2024-08-09T10:54:58+05:30

    • సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియాకు ఊరట

    • ఢిల్లీ: సుప్రీంకోర్టులో మనీశ్ సోడియాకు ఊరట

    • మనీశ్ సిసోడియాకు షరతులో కూడిన బెయిల్ మంజూరు

    • ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాకు బెయిల్

    • సీబీఐ, ఈడీ విడివిడిగా విచారించిన రెండు కేసుల్లో సిసోడియాకు బెయిల్

    • 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు సిసోడియా

    • నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు

    • ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని ఆదేశం

    manish sisodia.jpg

  • 2024-08-09T10:31:53+05:30

    షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్ వస్తారు..!!

    • ఢాకా: భారత్‌లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

    • భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనా

    • బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రగడ ఉగ్రరూపం దాల్చడంతో ప్రధాని పదవికి రాజీనామా, భారత్‌లో ఆశ్రయం

    • బంగ్లాదేశ్‌లో కొలువుదీరిన ఆపద్ధర్మ ప్రభుత్వం

    • ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ యూనాస్

    • షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్ వస్తారని కుమారుడి సంచలన ప్రకటన

    • బంగ్లాదేశ్‌లో పరిస్థితి చక్కబడి, ఎన్నికలు జరిగితే వస్తారని స్పష్టీకరణ

      sheik.jpg

  • 2024-08-09T10:15:02+05:30

    మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ తీర్పు‌పై ఉత్కంఠ

    • ఢిల్లీ: సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై తీర్పు.

    • తీర్పు వెలువరించనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మాసనం

    • ఆగస్టు 5, 6వ తేదీల్లో విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

    • సిసోడియా బెయిల్‌ను వ్యతిరేకించిన ఈడీ, సీబీఐ

    • సిసోడియా విచారణకు సహకరించడం లేదు, జాప్యం చేస్తున్నారు.

    • అనవసరపు పత్రాలను తనిఖీ చేయాలని కోరుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు

    • సిసోడియాకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టును కోరిన ఈడీ, సీబీఐ

    • అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వాదనల్లో తెలిపిన ఈడీ, సీబీఐ

    • గతేడాది అక్టోబర్ నుంచి తనపై ఉన్న కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియా

  • 2024-08-09T10:11:06+05:30

    మత్తడి పోస్తున్న పాకాల సరస్సు

    • వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

    • వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లో గల పాకాల సరస్సు

    • పాకాల సరస్సు చేరిన వరదనీరు, 30.4 అడుగులకు చేరిన నీటిమట్టం

    • మత్తడి పోస్తున్న పాకాల సరస్సు

    • ఇటు భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం

    • 35.70 అడుగుల వద్ద 6,08,283 క్యూసెక్కుల నీటి ప్రవాహం

  • 2024-08-09T10:06:56+05:30

    గురుకుల పాఠశాలలో విషాదం..

    • జగిత్యాల జిల్లా: పెద్దపూర్ గురుకుల పాఠశాలలో మళ్ళీ కలకలం.

    • ఉదయం 5 గంటలకు అస్వస్థతకు గురైన బాలుడు.

    • కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

    • అక్కడి నుంచి జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ బాలుడి మృతి.

    • మృతి చెందిన బాలుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్‌గా గుర్తింపు.

    • మరో విద్యార్ధి మొక్షిత్‌కు ఆస్వస్థత, ఆసుపత్రికి తరలింపు.

  • 2024-08-09T10:00:36+05:30

    • అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం

    • ఇంటర్నేషనల్ ట్రైబల్ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

    • స్వచ్ఛమైన మనస్సులు, ప్రకృతిని ప్రేమించే మనుషులు, సమాజానికి ప్రకృతి సంపద పంచడమే తప్ప ఏమి ఆశించిన ఆదివాసీల వ్యక్తిత్వం నిత్య స్పూర్తి అంటూ లోకేశ్ ట్వీట్

    • ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

  • 2024-08-09T09:53:32+05:30

    శ్రావణ శోభ

    • విశాఖపట్టణం: అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ

    • శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారి సేవలో మహిళలు

    • శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు

    • శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన, సామూహిక వరలక్ష్మి వ్రతాలు

    • అమ్మవారిని సందర్శించుకుంటున్న భక్తులు

    • భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు

      TEMPLES-2.jpg

  • 2024-08-09T09:48:57+05:30

    వైసీపీని వీడేది లేదు: ఆనం విజయ్

    • నెల్లూరు: జడ్పీ సమావేశానికి ఆహ్వానించేందుకు మంత్రి నారాయణని కలిశాం.

    • జడ్పీ చైర్మన్ పదవిని వైసీపీ ఇచ్చింది. ఆ పార్టీని వీడేది లేదు.

    • రాజకీయాలకి అతీతంగా జిల్లా అభివృద్దికి తోడ్పడుతాం: జెడ్పీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి దంపతులు

  • 2024-08-09T09:04:04+05:30

    • కాంగ్రెస్ వాయిదా తీర్మానం

    • ఢిల్లీ: లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం.

    • రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనార్హత అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం.

  • 2024-08-09T09:02:50+05:30

    కీలక నిర్ణయలు తీసుకునే అవకాశం..!!

    • ఢిల్లీ: సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.

    • పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

    • బంగ్లాదేశ్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రాధాన్యం

      modi cabinet.jpg

  • 2024-08-09T08:58:17+05:30

    వైసీపీకి భారీ షాక్..?

    • నెల్లూరు: టీడీపీలోకి జోరుగా వలసలు

    • మంత్రి నారాయణ నివాసానికి చేరుకున్న వైసీపీ జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ దంపతులు

    • మంత్రి నారాయణతో ఆనం అరుణమ్మ, ఆమె భర్త విజయకుమార్ రెడ్డి భేటీ

    • ఆనం విజయకుమార్ రెడ్డి వెళ్లడంపై ప్రాధాన్యం

    • టీడీపీలో చేరేందుకే మంత్రి నారాయణ నివాసానికి వెళ్లారనే చర్చ.

    • ఆనం విజయకుమార్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరితే జగన్ పార్టీకి కోలుకోలేని దెబ్బే..!!

    • రేపు (శనివారం) జరిగే జెడ్పీ సమావేశానికి ఆహ్వానించడానికి వెళ్లారంటోన్న వైసీపీ శ్రేణులు

  • 2024-08-09T08:51:21+05:30

    అభినందనలు

    • బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా మహ్మద్ యూనస్ బాధ్యతలు

    • అభినందనలు తెలియజేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

    • బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోండి.

    • బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధం : ప్రధాని మోదీ

      PM Modi.jpg

  • 2024-08-09T08:45:16+05:30

    సీబీఐ చార్జిషీట్‌పై నేడు విచారణ

    • ఢిల్లీ: లిక్కర్ కేసు సీబీఐ చార్జిషీట్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ

    • కవితతో పాటు ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరు

    • ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో A17గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

    • ప్రస్తుతం తీహార్ జైలులో కవిత.

      2kavitha (2).jpg

  • 2024-08-09T07:48:50+05:30

    • అర్షద్ నదీమ్ కూడా మన బిడ్డే: నీరజ్ తల్లి

    • ఒలింపిక్స్‌ జావెలిన్ త్రోలో అర్షద్‌కు గోల్డ్ మెడల్

    • పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన అర్షద్ నదీమ్

    • జావెలిన్ త్రోలో సెకండ్ ప్లేస్‌లో నిలిచిన నీరజ్ చోప్రా

    • అభిమానుల హృదయాలను గెలుచుకున్న నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి

      neeraj-and-arshad.jpg

  • 2024-08-09T07:43:35+05:30

    • ఎస్సైల బదిలీలు

    • కడప జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు

    • 63 మంది ట్రాన్స్‌ఫర్

  • 2024-08-09T07:41:00+05:30

    వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ డ్రామా

    • శ్రీకాకుళం: టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా.

    • కొంతకాలంగా దువ్వాడ దంపతుల మధ్య విబేధాలు.

    • కుటుంబానికి దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ.

    • నిన్న సాయంత్రం తండ్రిని కలువటానికి వచ్చిన కుమార్తెలు, ఇంట్లోకి అనుమతించని దువ్వాడ.

    • అర్ధరాత్రి వరకు తండ్రి పిలుపు కోసం వేచి చూసి వెనుతిరిగిన కుమార్తెలు.

    • దువ్వాడ వ్యవహారంపై టెక్కలిలో రకరకాల చర్చలు.

  • 2024-08-09T07:36:26+05:30

    బెయిల్ వచ్చేనా..?

    • ఢిల్లీ: లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పాటిషన్‌పై తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు.

    • గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదిన ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

    • ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న మనీష్ సిసోడియా.

  • 2024-08-09T07:33:52+05:30

    కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు

    • అమరావతి: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు

    • ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని వెల్లడి

    • బిజీ షెడ్యూల్‌లో విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించారు

    • మీరు, మీ ప్రభుత్వ బృందం అందించిన సహకారాన్ని మరవలేం

  • 2024-08-09T07:27:00+05:30

    అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ

    • అమెరికా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • గూగుల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ

    • స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో బయో డిజైన్ సెంటర్‌లో సస్టెనబిలిటీ డీన్ అరుణ్ మజుందార్, ప్రొఫెసర్ రాజ్ దత్‌తో చర్చలు

    • తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ

    • సీఎం రేవంత్ రెడ్డితో పాటు అమెరికా పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

      reva.jpg

  • 2024-08-09T07:20:02+05:30

    భారీగా తగ్గిన బంగారం ధర

    • గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం

    • రెండురోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.1300 తగ్గుదల

    • శుక్రవారం మరో రూ.100 తగ్గింపు

    • హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,490

    • మేలిమి బంగారం ధర రూ.69,260

    • విశాఖపట్టణం, విజయవాడలో ఇవే ధరలు

      gold-new.jpg

  • 2024-08-09T07:15:46+05:30

    ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.