Share News

Bangalore: ఏపీ రాజకీయాల్లోకి శ్రీరాములు కుటుంబం..

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:09 PM

భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ జే. శ్రీరాములు కుటుంబం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం చర్చనీ యాంశంగా మారింది. బీజేపీకి చెందిన బళ్లారి మాజీ ఎంపీ జే. శాంత(Former Bellary MP J. Shanta) మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌రెడ్డి

Bangalore: ఏపీ రాజకీయాల్లోకి శ్రీరాములు కుటుంబం..

- వైసీపీలోకి బీజేపీ నాయకులు

- జగన్‌ చేతుల మీదుగా కండువా కప్పుకున్న బళ్లారి మాజీ ఎంపీ శాంత

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ జే. శ్రీరాములు కుటుంబం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం చర్చనీ యాంశంగా మారింది. బీజేపీకి చెందిన బళ్లారి మాజీ ఎంపీ జే. శాంత(Former Bellary MP J. Shanta) మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌రెడ్డి చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్నారు. జే.శాంత బళ్లారి మాజీ ఎంపీ, మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sri Ramulu)కు స్వయానా సోదరి కావడం విశేషం. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన శ్రీరాములు కర్ణాటక బీజేపీ(Karnataka BJP)లో కీలక నాయకుడు. గత బీజేపీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఎంపీ గానూ గెలిచారు. జే.శాంత భర్త గుంతకల్లుకు చెందినవారు. అయినా ఆమె బళ్లారిలోనే ఉంటున్నారు. 2009లో బీజేపీ నుంచి బళ్లారి ఎంపీగా జే.శాంత చేత పోటీ చేయించారు. అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో జే.శ్రీరాములు, గాలి జనార్దన్‌రెడ్డి, గాలి కరుణాకర్‌ రెడ్డి మంత్రులుగా ఉండేవారు. అలాగే గాలి సోమశేఖర్‌రెడ్డి కేఎంఎఫ్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ఒక్క సండూరు మినహా బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.

zzz.jpg

అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్‌వై హనుమంతప్ప పోటీలో నిలిచారు. బీజేపీకి ఇంత బలం ఉన్నా ఆమె ఎన్‌వై హనుమంతప్ప పై కేవలం 2వేల పై చిలుకు ఓట్లతోనే ఎంపీగా గెలిచారు. పది వరకూ చదివిన జే. శాంత తెలుగు బాగా మాట్లాడగలరు. గతంలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో గాలి బ్యాచ్‌ అంతా ఓడిపోయింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీరాములు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రస్తుత మంత్రి బి. నాగేంద్ర(Minister B. Nagendra) చేతిలో చిత్తుగా ఓడిపోయారు. శ్రీరాములు వర్గం దాదాపు కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోయింది. అయితే మాజీ మంత్రి శ్రీరాములు తన సోదరి జే. శాంతను ఏపీ రాజకీయాల్లో ...అదీ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో చేర్పించడం వెనుక హైద్రాబాద్‌(Hyderabad)కు చెందిన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. శాంతను అనంతపురం, లేదా హిందూపురం ఎంపీగా పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. వాల్మీకి సమాజానికి చెందిన వారిని కర్ణాటక నుండి దిగుమతి చేసుకోవడంపై అక్కడ ఉండే వాల్మీకులు జగన్‌మోహన్‌రెడ్డిపై మండిపడుతున్నారు. ఇంతకాలం పార్టీలో ఉన్న తమను కాదని ఎక్కడో కర్ణాటక నుంచి తీసుకొచ్చి శాంత చేత పోటీ చేయించడం ఎంతవరకు సమంజసమని అక్కడ వైసీసీ కార్యకర్తలు మండి పడుతున్నారు. మొత్తం మీద ఇక్కడ కర్ణాటక బీజేపీలో ఉండే మాజీ ఎంపీ శ్రీరాములు సోదరి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి.

Updated Date - Jan 03 , 2024 | 12:18 PM