Share News

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం.. గూడ్స్ ఢీకొన్ని 8 మంది..

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:24 AM

ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెమెతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబసభ్యులు ఆదివారం ఓ వేడుకకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు.

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం.. గూడ్స్ ఢీకొన్ని 8 మంది..

బెమెతర: ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) విషాదం చోటు చేసుకుంది. ట్రక్కును గూడ్స్ వాహనం ఢీ(Road Accident)కొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెమెతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబసభ్యులు ఆదివారం ఓ వేడుకకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలో ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొట్టింది. ఘటనాస్థలిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.


భూరి నిషాద్ (50), నీరా (55), గీతా (60), అగ్నియా (60), ఖుష్బు (39), మధు (5), రికేశ్ నిషాద్ (6), ట్వింకిల్ నిషాద్ (6) మృతులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని రాయ్‌పుర్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Latest news and National News here..

Updated Date - Apr 29 , 2024 | 10:24 AM