Share News

MLAs Resigh: ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:40 PM

హిమాచల్ ప్రదేశ్‌లో వేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు శుక్రవారంనాడు రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ రాజీనామాలను సమర్పించారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వీరు సిద్ధమవుతున్నారు.

MLAs Resigh: ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో వేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు (Independent MLAs) శుక్రవారంనాడు రాజీనామా (Resign) చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ రాజీనామాలను సమర్పించారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వీరు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు.


ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆశిష్ శర్మ (హమీర్‌పూర్ నియోజవర్గం), హోషియార్ సింగ్ (డెహ్రా), కేఎల్ ఠాకూర్ (నాలాగఢ్) శుక్రవారం ఉదయం అసెంబ్లీలో విపక్ష నేత జైరామ్ ఠాకూర్‌ను కలుసుకున్నారు. అనంతరం తమ రాజీనామాను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. హోషియార్ సింగ్ ఈ విషయం మీడియాకు తెలియజేశారు. తమ రాజీనామానును అసెంబ్లీ సెక్రటరీకి అందజేశామని, బీజేపీలో చేరనున్నామని చెప్పారు. బీజేపీ టిక్కెట్‌పై తాము పోటీ చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - Mar 22 , 2024 | 04:40 PM