Share News

AP Elections: మదనపల్లి చుట్టూ ఔటర్ ఏది..? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిందా: షర్మిల

ABN , Publish Date - Apr 16 , 2024 | 09:28 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మదనపల్లెలో పర్యటించిన షర్మిల స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీ - నీవా కట్టాలని అనుకున్నారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్న సమయంలో 90 శాతం పనులు జరిగాయని వివరించారు.

AP Elections: మదనపల్లి చుట్టూ ఔటర్ ఏది..? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిందా: షర్మిల
Where Is Outer Of The Madanapalle

అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (Jagan) ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మదనపల్లెలో పర్యటించిన షర్మిల స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీ - నీవా కట్టాలని అనుకున్నారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్న సమయంలో 90 శాతం పనులు జరిగాయని వివరించారు. హంద్రీ - నీవా పూర్తయి ఉంటే మదనపల్లి నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు వచ్చేదని తెలిపారు.

AP News: జగన్.. నా అన్నాడంటే నాశనమే


సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మదనపల్లి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు అన్నారు. ఫ్యాన్ గాలికి ఔటర్ కొట్టుకు పోయిందా..? అని ధ్వజమెత్తారు. సమ్మర్ ట్యాంక్ కడతాం అన్నారు.. ? ఆ మాట కూడా మరిచారు. మదనపల్లి టమాటాకి ఫెమస్. ధర హెచ్చు తగ్గులతో ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. 3 వేల కోట్లతో చెప్పిన ప్రత్యేక ధరల స్థిరీకరణ ఏమయ్యింది ? టమాటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏమయ్యాయి ? చేనేతల కోసం క్లస్టర్ ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఒక్క క్లస్టర్ కట్టారా ? మదనపల్లి చీరలకు బ్రాండ్ కల్పిస్తాం అన్నారు...ఆ బ్రాండ్ ఎక్కడ ? నియోజక వర్గంలో ఒక్క హామీ అమలు కాలేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలకు దిక్కులేదు అని’ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

AP News: జగన్.. నా అన్నాడంటే నాశనమే

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 16 , 2024 | 09:28 PM