Share News

ABN Big Debate: ముఖ్యమంత్రి జగన్‌ను భయపెట్టిన సీఎం రమేష్..!!

ABN , Publish Date - Apr 22 , 2024 | 08:56 PM

సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత గ్రాఫ్ డౌన్ అయ్యిందని ఆర్కే ప్రశ్నించగా అదేం లేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. జగన్ బస్సుయాత్రకు క్రేజీ వచ్చిందని అసత్య ప్రచారం చేసుకున్నారని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించింది తానేనని గుర్తుచేశారు. రాజ్యసభకు పోటీ చేస్తానని ప్రకటిస్తే.. సీఎం జగన్ భయపడ్డారని తెలిపారు. సీఎం జగన్ వైసీపీ నేతలతో చెప్పిన విషయం తనకు 5 నిమిషాల్లో తెలిసిందని చెప్పారు.

ABN Big Debate: ముఖ్యమంత్రి జగన్‌ను భయపెట్టిన సీఎం రమేష్..!!
CM Ramesh

‘ఇడుపులపాయలో సీఎం జగన్ 175 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ప్రకటించారు. 25 మంది పేర్లు రాసుకున్నప్పటికీ 24 మంది అభ్యర్థుల పేర్లనే ప్రకటించారు. అనకాపల్లి నుంచి తాను బరిలోకి దిగుతున్నానని అధికారిక ప్రకటన కూడా రాలేదు. అనకాపల్లి బీజేపీకి పోయింది, సీఎం రమేష్‌కు వస్తుందని తెలిసి.. సత్యవతిని మార్చారు. ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు లేని లోటును తీరుస్తాం. వెంగళరావు లేని లోటును తీరుస్తా. 500 మంది ఓటర్లు ఉండే కడపలో ఇన్నాళ్లూ రాజకీయం చేశా. ఇక్కడ వాళ్లందరికీ నీళ్లు తాగించా. అనకాపల్లెల్లో మూడున్నర లక్షల మంది ఉన్నారని చెప్పగా చప్పట్లు కొట్టి స్వాగతించారు అని’ సీఎం రమేష్ ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో వివరించారు. సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత గ్రాఫ్ డౌన్ అయ్యిందని ఆర్కే ప్రశ్నించగా అదేం లేదని సమాధానం ఇచ్చారు. జగన్ బస్సుయాత్రకు క్రేజీ వచ్చిందని అసత్య ప్రచారం చేసుకున్నారని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించింది తానేనని గుర్తుచేశారు. రాజ్యసభకు పోటీ చేస్తానని ప్రకటిస్తే.. సీఎం జగన్ భయపడ్డారని తెలిపారు. సీఎం జగన్ వైసీపీ నేతలతో చెప్పిన విషయం తనకు 5 నిమిషాల్లో తెలిసిందని చెప్పారు.


Read Latest Election News or Telugu News

Updated Date - Apr 22 , 2024 | 08:56 PM