Hyderabad: అతివేగం ప్రాణాలు తీసింది..
ABN , Publish Date - Dec 28 , 2024 | 07:01 AM
ఖరీదైన బైకు.. రోడ్లు ఖాళీగా ఉన్నాయి ఇంకేముంది.. వేగం పెంచారు కానీ, అదుపు చేయలేకపోయారు. అంతే ద్విచక్రవాహనం డివైడర్ను ఢీ కొట్టడంతో ఇద్దరు టెకీలు మృతి చెందారు. కన్న వారికి కడుపుకోత మిగిల్చారు. ఈ ప్రమాదం మాదాపూర్ పోలీస్స్టేషన్(Madhapur Police Station) పరిధిలో జరిగింది.

- డివైడర్ను ఢీకొని ఇద్దరు టెకీల దుర్మరణం
హైదరాబాద్: ఖరీదైన బైకు.. రోడ్లు ఖాళీగా ఉన్నాయి ఇంకేముంది.. వేగం పెంచారు కానీ, అదుపు చేయలేకపోయారు. అంతే ద్విచక్రవాహనం డివైడర్ను ఢీ కొట్టడంతో ఇద్దరు టెకీలు మృతి చెందారు. కన్న వారికి కడుపుకోత మిగిల్చారు. ఈ ప్రమాదం మాదాపూర్ పోలీస్స్టేషన్(Madhapur Police Station) పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బోరబండ ప్రాంతానికి చెందిన ఆకాంక్ష్ (24), రఘుబాబు (23) స్నేహితులు. వీరు ఐటీ ఉద్యోగం చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..
గురువారం ఆకాంక్ష్కు చెందిన ఓ ఖరీదైన బైక్పై బోరబండ నుంచి మాదాపూర్కు బయలు దేరారు. పర్వత్నగర్ సిగ్నల్(Parvatnagar Signal) దాటిన తరువాత 100 ఫీట్ రోడ్డు వైపు తిరిగారు. రోడ్డు ఖాళీ ఉండటంతో వేగం పెంచారు. కానీ, వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ కింద పడటంతో తీవ్రమైన గాయాలయ్యాయి. వాహనం నిప్పులు రాజుకుంటూ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది.
స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆకాంక్ష్ మార్గ మధ్యలో మరణించాడు. చికిత్స పొందుతూ రఘుబాబు మరణించాడు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆకాంక్ష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు
ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..
Read Latest Telangana News and National News