Share News

Wife: భార్యను సముద్రంలో ముంచి హత్య చేసిన భర్త..ఎందుకలా చేశాడు?

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:08 PM

గోవాలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు ఘటన మరువక ముందే మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా వస్తుందనే కారణంతో ఓ భర్త తన భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు.

Wife: భార్యను సముద్రంలో ముంచి హత్య చేసిన భర్త..ఎందుకలా చేశాడు?

గోవా(goa)లో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు ఘటన మరువక ముందే మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా వస్తుందనే కారణంతో ఓ భర్త తన భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసి ఓ వీడియో కారణంగా అడ్డంగా దొరికిపోయాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు చుద్దాం.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Hyderabad: వ్యభిచారం కేసులో కొత్త కోణాలు.. పోలీసుల అదుపులో నిందితులు..

దక్షిణ గోవాలో ఉంటున్న హోటల్ మేనేజర్ గౌరవ్ కటియార్ (29) అతని భార్య దీక్షా గంగ్వార్ (27)కి ఏడాది క్రితం పెళ్లైంది. కానీ గౌరవ్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆమె పలుమార్లు ఆరోపించేది. ఆ క్రమంలోనే వారి మధ్య విభేదాలు పెరిగాయి. ఆ నేపథ్యంలోనే ఆమెను హత్య చేయాలని అనుకున్న గౌరవ్ గోవాలోని కాబో డీ రామ తీర ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను సముద్రంలో ముంచి శుక్రవారం మధ్యాహ్నం హత్య చేశాడు.

ఆ తర్వాత భర్త ఒక్కడే ఒంటరిగా రావడం చూసిన పలువురు పర్యాటకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని ఆరా తీయగా ప్రమాదవశాత్తు తన భార్య నీటిలో మునిగిపోయిందని.. ఆమెను కాపాడలేకపోయానంటూ నాటకమాడాడు. ఆ క్రమంలోనే ఓ పర్యాటకుడు గౌరవ్‌ చర్యలను చిత్రీకరించగా..అవి చూసిన పోలీసులు గౌరవ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

వీడియోలో భార్య చనిపోయిందని ధ్రువీకరించుకున్నాకే గౌరవ్‌ నీటి నుంచి బయటకు వచ్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించిందని పోలీసులు అన్నారు. గౌరవ్, ఆయన భార్య దీక్ష ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నివాసి అని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:08 PM