Congress MLA: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Mar 19 , 2024 | 11:17 AM
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలకు అధికారులు సీలు వేశారు. ఈ నేపథ్యంలో, మైలాడుదురై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్కుమార్(Congress MLA Rajkumar)
చెన్నై: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలకు అధికారులు సీలు వేశారు. ఈ నేపథ్యంలో, మైలాడుదురై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్కుమార్(Congress MLA Rajkumar) శనివారం రాత్రి పక్క తలుపు గుండా తన కార్యాలయంలోకి ప్రవేశించి, కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో కార్యాలయంలో విందు ఏర్పాటుచేశారు. ఈ వ్యవహారంపై ఆదివారం ఉదయం పట్టమంగళం వీఏఓ మైలాడుదురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రకారం, ఎమ్మెల్యే రాజ్కుమార్, ఆయన మద్దతుదారులపై ఎన్నికల నిబంధనల అతిక్రమణ తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు.