Share News

Chennai: ముగ్గురుని బలితీసుకున్న వివాహేతర సంబంధం..

ABN , Publish Date - May 12 , 2024 | 12:15 PM

భార్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేని భర్త తన ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న విషాదక ఘటన శనివారం నగరంలో చోటుచేసుకుంది. వెస్ట్‌ మాంబాళం కృష్ణప్ప నాయకర్‌ వీధికి చెందిన మోహన్‌ (55) పాత ఇనుప వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు భార్య యమున, సాయి స్వాతి (13), తేజర్‌ (5) అనే ఇద్దరు పిల్లలున్నారు.

Chennai: ముగ్గురుని బలితీసుకున్న వివాహేతర సంబంధం..

- పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

- వెస్ట్‌ మాంబాళంలో దారుణం

చెన్నై: భార్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేని భర్త తన ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న విషాదక ఘటన శనివారం నగరంలో చోటుచేసుకుంది. వెస్ట్‌ మాంబాళం కృష్ణప్ప నాయకర్‌ వీధికి చెందిన మోహన్‌ (55) పాత ఇనుప వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు భార్య యమున, సాయి స్వాతి (13), తేజర్‌ (5) అనే ఇద్దరు పిల్లలున్నారు. యమున ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌(Printing Press)లో పనిచేస్తున్నారు. ఆమె శుక్రవారం ఎప్పటిలాగే పనికి వెళ్ళగా, మోహన్‌ తన ఇద్దరు పిల్లలతో ఇంటిలోనే ఉన్నారు. అయితే, తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న విషయం తెలుసుకుని ఆమెను పలుమార్లు మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మోహన్‌.. తన ఇద్దరు పిల్లలను గొంతుకోసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదికూడా చదవండి: PM Modi: సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష..!!

శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చిన యమున.. తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా లోపల గడియపెట్టి ఉండటంతో ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్ళి చూడగా తన ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులోనూ భర్త ఉరి వేసుకునికి వేలాడుతుండటాన్ని చూసి విలపిస్తూ కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై స్థానికులిచ్చిన సమాచారం మేరకు కుమరన్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అముద జరిపిన ప్రాథమిక విచారణలో.. భార్య పరాయి పురషుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక మోహన్‌... కొన్ని నెలల పాటు భార్యకు దూరంగా ఉన్నాడు. తర్వాత ఈ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్ళింది. పోలీసులు దంపతులను కలపడంతో రెండు నెలలుగా వెస్ట్‌ మాంబాళంలో ఉంటున్నారు. అయితే, తప్పుదారిలో నడిచిన భార్యతో కలిసి జీవించడం ఇష్టంలేని భర్త మోహన్‌ తన ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 12 , 2024 | 12:15 PM