Share News

Jan Aushadhi Kendra: జన్ ఔషధి కేంద్రం ప్రారంభించే వారికి గుడ్ న్యూస్

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:16 PM

దేశంలో సామాన్యులకు తక్కువ ధరకే మందులను అందించేందుకు మోదీ ప్రభుత్వం జన్ ఔషధి కేంద్రాల(Jan Aushadhi Kendra) సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఇది ప్రారంభించాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Jan Aushadhi Kendra: జన్ ఔషధి కేంద్రం ప్రారంభించే వారికి గుడ్ న్యూస్

దేశంలో సామాన్యులకు తక్కువ ధరకే మందులను అందించేందుకు మోదీ ప్రభుత్వం జన్ ఔషధి కేంద్రాల(Jan Aushadhi Kendra) సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఇది ప్రారంభించాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. అది ఏంటంటే జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఎలాంటి హామీ లేకుండా రుణాలు అందిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం SIDBIతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా(mansukh mandaviya) వెల్లడించారు.

ఈ నేపథ్యంలో జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు కోసం https://jak-prayaasloans.sidbi.in/home వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభించేవారు సులభంగా రుణం పొందవచ్చని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం జన్ ఔషధి కేంద్రం చిన్న ఆపరేటర్లకు ఎటువంటి హామీ లేకుండా SIDBI నుంచి రుణాలు(loans) అందించనున్నారు. ఈ రుణాలు గ్యారెంటీ, వర్కింగ్ క్యాపిటల్ లేదా టర్మ్ లోన్‌లు అయినా, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా అందించబడతాయి.


గ్రామీణ ప్రాంతాల్లో(villages) జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా జనరిక్ మందులు(medicines) ప్రజలకు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.2,250 ఖరీదు చేసే క్యాన్సర్‌ ఔషధాన్ని ఇక్కడ రూ.250కి విక్రయిస్తున్నారు. గ్రామీణ బాలికలు ఈ కేంద్రాల నుంచి శానిటరీ నాప్‌కిన్‌లను ఒక రూపాయికి కొనుగోలు చేయవచ్చు.

మార్చి 31, 2026 నాటికి దేశవ్యాప్తంగా(india) 25,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరి వరకు దేశవ్యాప్తంగా 10,624 జన్ ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ జన్ ఔషధి కేంద్రాల(Jan Aushadhi Kendra) ద్వారా దాదాపు 1,965 జనరిక్ ఔషధాలు, 293 శస్త్రచికిత్స ఉత్పత్తులు సరసమైన ధరలకు విక్రయించబడుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ కేంద్రాల ద్వారా రూ. 1,235.95 కోట్ల విక్రయాలు నమోదు కాగా, ఫలితంగా ప్రజలకు(people) దాదాపు రూ. 7,416 కోట్లు ఆదా అయ్యాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Stock Market Updates: 1879 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మిడ్ క్యాప్..భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Updated Date - Mar 13 , 2024 | 03:17 PM