Share News

YSRCP: టీడీపీ నేత కారును తగులబెట్టిన వైఎస్సార్‌సీపీ అల్లరి మూకలు

ABN , Publish Date - Mar 19 , 2024 | 10:31 AM

మాచర్ల లో టీడీపీ నేత కారును వైఎస్సార్‌సీపీ అల్లరి మూకలు తగులబెట్టాయి. 10 వ వార్డు కి చెందిన టీడీపీ నేత వీర్ల సురేష్‌కి చెందిన మారుతి బ్రిజా కారును వైసీపీ కార్యకర్తలు తగలబెట్టారని బాదితులు ఆరోపిస్తున్నారు.

YSRCP: టీడీపీ నేత కారును తగులబెట్టిన వైఎస్సార్‌సీపీ అల్లరి మూకలు

పల్నాడు: మాచర్ల లో టీడీపీ (TDP) నేత కారును వైఎస్సార్‌సీపీ (YSRCP) అల్లరి మూకలు తగులబెట్టాయి. 10 వ వార్డు కి చెందిన టీడీపీ నేత వీర్ల సురేష్‌కి చెందిన మారుతి బ్రిజా (Maruthi Briza) కారును వైసీపీ కార్యకర్తలు తగలబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తన ఇంటి ముందు కారు నిలుపు చేసేందుకు స్థలం లేక పోవడంతో తన ఇంటికి సమీపంలోని సెయింట్ జేవీఆర్ స్కూల్ గేట్ ముందు సురేష్ పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో మంటల్లో కారు తగలబడటాన్ని సురేష్ కుటుంబ సభ్యులు గమనించారు. ఇది కచ్చితంగా వైసీపీ వాళ్లు చేసిన పనేనని సురేష్ ఆరోపిస్తున్నాడు.

Atchannaidu: వైసీపీ రాక్షస జాతి పార్టీ..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 10:31 AM