AP News: రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు: ఎంఏ షరీఫ్
ABN , Publish Date - Feb 12 , 2024 | 01:10 PM
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, సర్వేలన్నీ తెలుగుదేశం, జనసేన కూటములకే అనుకూలంగా ఉన్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ వ్యాఖ్యానించారు.
![AP News: రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు: ఎంఏ షరీఫ్](https://media.andhrajyothy.com/media/2023/20231205/sharif_989d9d259b.jpg)
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, సర్వేలన్నీ తెలుగుదేశం, జనసేన కూటములకే అనుకూలంగా ఉన్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన పశ్చిమగోదావరిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సమర్థవంతమైన టీడీపీ, జనసేన పాలననే కోరుకుంటున్నారన్నారు. బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కావాల్సి ఉందని, అభ్యర్థుల ప్రకటనపై వస్తున్నవన్నీ ఊహగానాలేనని ఎంఏ షరీఫ్ పేర్కొన్నారు.