Share News

Tadepalligudem: మాధవరంలో ఘోర రోడ్డు ప్రమాదం...

ABN , Publish Date - Jan 08 , 2024 | 09:08 AM

ప.గో.జిల్లా: తాడేపల్లిగూడెం మండలం, మిలటరీ మాధవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ముగ్గురు మైనర్లు అతి వేగంగా వెళుతూ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొన్నారు. ఈ ఘటనలో ముగ్గరూ అక్కడికక్కడే చినిపోయారు.

Tadepalligudem: మాధవరంలో ఘోర రోడ్డు ప్రమాదం...

ప.గో.జిల్లా: తాడేపల్లిగూడెం మండలం, మిలటరీ మాధవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ముగ్గురు మైనర్లు అతి వేగంగా వెళుతూ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొన్నారు. ఈ ఘటనలో ముగ్గరూ అక్కడికక్కడే చినిపోయారు. శనివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రమాదం జరిగింది.

మృతులు ముగ్గురు తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులుగా గుర్తించారు. శనివారం రాత్రి మాధవరం హైస్కూల్ సమీపంలోని గ్రౌండ్‌లో స్నేహితుని పుట్టిన రోజు వేడుకల్లో ముగ్గురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్టీలో మద్యం సేవించి, మధ్యలో ముగ్గురు యువకులు బయటకు వచ్చిన తరువాత ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన వెంటనే తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 08 , 2024 | 09:08 AM