Share News

AP News: వైసీపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి: జన జాగరణ సమితి

ABN , Publish Date - Feb 02 , 2024 | 08:44 AM

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు విశాఖలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని..

AP News: వైసీపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి: జన జాగరణ సమితి

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు విశాఖలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, కానీ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూములు ఇవ్వడానికి ఏమాత్రం ఆసక్తి చూపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఎవరైనా రైల్వే భూములను కబ్జా చేస్తే సీఎం జగన్ ఒప్పుకుంటారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరని అన్నారు. వైసీపీకి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఎలాంటి చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అంటూ మాయ మాటలు చెప్పిన జగన్ ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెప్పాలని వాసు పిలుపిచ్చారు.

Updated Date - Feb 02 , 2024 | 08:44 AM