Share News

Nara Lokesh: ఉత్తర నియోజకవర్గంలో లోకేష్ శంఖారావం ప్రారంభం

ABN , Publish Date - Feb 19 , 2024 | 12:10 PM

మరికాసేపట్లో విశాఖ నార్త్ శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో బిర్ల జంక్షన్ గ్రౌండ్ వద్ద సభా ప్రాంగణానికి టీడీపీ-జనసేన శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన లోకేష్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

Nara Lokesh: ఉత్తర నియోజకవర్గంలో లోకేష్ శంఖారావం ప్రారంభం

విశాఖ: మరికాసేపట్లో విశాఖ నార్త్ శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో బిర్ల జంక్షన్ గ్రౌండ్ వద్ద సభా ప్రాంగణానికి టీడీపీ-జనసేన శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన లోకేష్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, సూపర్ 6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కేడర్‌కు లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబు ష్యూరిటీ-భవిష్యత్‍కు గ్యారెంటీలో ఉత్తమ పనితీరు కనబర్చిన కార్యకర్తలకు లోకేష్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేయనున్నారు. విశాఖపట్నం నార్త్ సభ అనంతరం మధ్యాహ్నం గాజువాక, సాయంత్రం అనకాపల్లి, చోడవరం శంఖారావం సభల్లో నారా లోకేష్ పాల్గొననున్నారు. రేపు సాయంత్రం పాయకరావుపేట సభతో ఉత్తరాంధ్ర శంఖారావం యాత్ర ముగియనుంది.

Updated Date - Feb 19 , 2024 | 12:10 PM