Share News

CM Jagan: రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జగన్..

ABN , Publish Date - Feb 21 , 2024 | 12:01 PM

నేడు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలునిర్వహించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో వామపక్షాల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

CM Jagan: రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జగన్..

విశాఖపట్నం: నేడు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో వామపక్షాల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎంకి స్వాగతం పలికేందుకు మార్గమధ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. దారి పొడవునా డ్వాక్రా మహిళలు.. సిద్ధం పోస్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ మానవహారంగా ఏర్పాటు చేశారు. ఎండలో మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2024 | 01:16 PM