Share News

Tirumala: ఇవాళ శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్..

ABN , Publish Date - Jan 09 , 2024 | 09:32 AM

ఇవాళ శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూసే. క్యూలైన్‌లోకి వెళుతూనే శ్రీవారిని ఎప్పుడు చూస్తాం.. ఎప్పుడు బయటకు వస్తామనే భయం పట్టుకుంటుంది. కానీ ఇవాళ తిరుమల క్యూలైన్స్‌లో పెద్దగా జనమే లేరు. శ్రీవారి దర్శనానికి ఒకే ఒక్క కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు.

Tirumala: ఇవాళ శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్..

తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూసే. క్యూలైన్‌లోకి వెళుతూనే శ్రీవారిని ఎప్పుడు చూస్తాం.. ఎప్పుడు బయటకు వస్తామనే భయం పట్టుకుంటుంది. కానీ ఇవాళ తిరుమల క్యూలైన్స్‌లో పెద్దగా జనమే లేరు. శ్రీవారి దర్శనానికి ఒకే ఒక్క కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,511 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 20,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Updated Date - Jan 09 , 2024 | 09:32 AM