Share News

AP News: వరుస దొంగతనాలు.. ఉలిక్కిపడ్డ మైలవరం ప్రజలు

ABN , Publish Date - Feb 16 , 2024 | 10:19 AM

Andhrapradesh: మైలవరంలో దొంగల బీభత్సం సృష్టించారు. మైలవరంలోని విజయ మిల్క్ డైరీ, రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి షాపులు మూసివేసిన తర్వాత వైన్ షాపుల్లో దొంగతనం చేశారు.

AP News: వరుస దొంగతనాలు.. ఉలిక్కిపడ్డ మైలవరం ప్రజలు

ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 16: మైలవరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మైలవరంలోని విజయ మిల్క్ డైరీ, రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి షాపులు మూసివేసిన తర్వాత వైన్ షాపుల్లో దొంగతనం చేశారు. మైలవరం బైపాస్ రోడ్‌లోని వాక్ ఇన్‌స్టోర్ (06950), పశువుల హాస్పటల్ సమీపంలోని మద్యం దుకాణం (06238), పక్కనే ఉన్న మిల్క్ డైరీలో దొంగలు చోరీకి తెగబడ్డారు. షాపు పైకప్పు రేకులు కత్తిరించి, తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించేందుకు దుండగులు యత్నించారు. అడ్డువచ్చిన వాచ్‌మెన్లను.. మద్యం సీసా పగలగొట్టి దాడి చేస్తామంటూ బెదిరించారు. ఆపై లోనికి వెళ్లిన దుండగులు చోరీ చేశారు. వాకిన్ స్టోర్‌లో సుమారు 2 లక్షల 11వేల రూపాయలు, మిల్క్ డైరీలో రూ.30 వేలు చోరీకి గురైనట్లు సిబ్బంది గుర్తించారు. షాపుల యాజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకేరోజు మూడు దొంగతనాలు జరగడంతో మైలవరం ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలీసుల గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 16 , 2024 | 10:19 AM