Share News

TDP: చిరు, పవన్‌లను ఓడించినప్పుడు జాతి గుర్తు రాలేదా?

ABN , Publish Date - Feb 06 , 2024 | 06:01 PM

మాజీ మంత్రి హరిరామజోగయ్య ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి రాసిన ఘాటు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

TDP: చిరు, పవన్‌లను ఓడించినప్పుడు జాతి గుర్తు రాలేదా?

తిరుపతి: మాజీ మంత్రి హరిరామజోగయ్య ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి రాసిన ఘాటు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు హరిరామ జోగయ్యపై మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, టీడీపీ సీనియర్ నేత ఓవీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్న చిరంజీవిని.. ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా ఉన్నపవన్ కళ్యాణ్‌లను ఓడించినపుడు జాతి ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు.

మీ స్వార్థం కోసం, ప్రలోభాల కోసం జాతిని తాకట్టు పెడుతున్నారని హరిరామ జోగయ్యపై ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాక హరిరామజోగయ్య వ్యాఖ్యలు సరికాదని ఓవీ రమణ పేర్కొన్నారు. గెలిచే వాళ్లకే టీడీపీ, జనసేన టికెట్లు ఇస్తారన్నారు. ఎంత మందికి టికెట్లు ఇవ్వాలో హరి రామజోగయ్య శాసించడం సరికాదన్నారు. లేఖాస్త్రాలు రాయడం హరిరామజోగయ్య మానుకోవాలన్నారు. కొందరి కుట్రలు, కుతంత్రాల ఉచ్చులో ఇరుక్కోవద్దని ఓవీ రమణ హితవు పలికారు.

Updated Date - Feb 06 , 2024 | 06:01 PM