Pawan Kalyan: పవన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడంపై వ్యంగ్య కార్టూన్ వైరల్..
ABN , Publish Date - Feb 15 , 2024 | 11:14 AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటనకు హెలికాఫ్టర్కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కల్పించింది. జనసేన సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వంపై సెటైర్ కార్టూన్ను ఆ పార్టీ నేతలు వైరల్ చేస్తున్నారు.
![Pawan Kalyan: పవన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడంపై వ్యంగ్య కార్టూన్ వైరల్..](https://media.andhrajyothy.com/media/2023/20231205/CM_JAGAN_1_dc0983e3c7.jpg)
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటనకు హెలికాఫ్టర్కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కల్పించింది. జనసేన సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వంపై సెటైర్ కార్టూన్ను ఆ పార్టీ నేతలు వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ కు అనుమతి ఇవ్వకుండా అడ్టుకున్న వైనంపై ఒక వ్యంగ్య చిత్రాన్ని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. *పవన్.. హెలికాప్టర్లోనే కాకుండా ఏ విధంగానూ తిరగకుండా గట్టిగా ప్లాన్ చేయాలంటున్నారు. లేదంటే మన కొంప మునుగుతుందంటూ ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో ఉన్నతాధికారుల మధ్య చర్చ జరుగుతున్నట్లు’గా కార్టూన్ను రూపొందించారు.