Share News

AP News: ఏపీలో ఆగని అనర్హత రాజకీయం..

ABN , Publish Date - Feb 17 , 2024 | 08:18 AM

ఏపీలో అనర్హత రాజకీయం ఆగడం లేదు. మళ్లీ ఈ నెల 19 న స్పీకర్ వద్దకు విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీస్‌లు అందాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది.

AP News: ఏపీలో ఆగని అనర్హత రాజకీయం..

అమరావతి: ఏపీలో అనర్హత రాజకీయం ఆగడం లేదు. మళ్లీ ఈ నెల 19 న స్పీకర్ వద్దకు విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీస్‌లు అందాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది. 19 వ తేది సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టీడీపీ , వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నిన్న రావాలని నోటీసుల్లో స్పీకర్ కార్యాలయం ఆదేశించింది. అయితే నిన్న ఇరుపక్షాల ఎమ్మెల్యే లు హాజరు కాలేదు.

Updated Date - Feb 17 , 2024 | 08:18 AM