Ex Minister Narayana: గెలిచాక ప్యాలెస్కే జగన్ పరిమితం..
ABN , Publish Date - Jan 30 , 2024 | 09:00 AM
నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనం మయూర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి గెలిచే వరకు పాదయాత్రలు చేశాడని... గెలిచాక ప్యాలెస్కే పరిమితమయ్యాడని విమర్శించారు.
![Ex Minister Narayana: గెలిచాక ప్యాలెస్కే జగన్ పరిమితం..](https://media.andhrajyothy.com/media/2023/20231205/narayana_f0aa2efa35.jpg)
నెల్లూరు: నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనం మయూర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి గెలిచే వరకు పాదయాత్రలు చేశాడని... గెలిచాక ప్యాలెస్కే పరిమితమయ్యాడని విమర్శించారు.
ఎవరో ఇచ్చే సలహాలతో అరాచకపు పాలన సాగిస్తున్నాడంటూ నారాయణ దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు. ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. సీట్ల కేటాయింపుని అధినేతలు నిర్ణయిస్తారన్నారు. పది రోజుల్లో అభ్యర్థులని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటిస్తారని నారాయణ తెలిపారు.