Share News

Ugadi 2024: తెలుగు ప్రజలకు నారా లోకేష్ ఉగాది శుభాకాంక్షలు..

ABN , Publish Date - Apr 09 , 2024 | 09:28 AM

Ugadi 2024: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది(Ugadi) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! న‌వ‌వ‌సంతం అంద‌రికీ ఆయురారోగ్యాలు, స‌క‌ల శుభాలు చేకూర్చాల‌ని ఆకాంక్షిస్తున్నాను. తెలుగువారి నూత‌న సంవ‌త్సరాదికి..

Ugadi 2024: తెలుగు ప్రజలకు నారా లోకేష్ ఉగాది శుభాకాంక్షలు..
Ugadi 2024

Ugadi 2024: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది(Ugadi) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! న‌వ‌వ‌సంతం అంద‌రికీ ఆయురారోగ్యాలు, స‌క‌ల శుభాలు చేకూర్చాల‌ని ఆకాంక్షిస్తున్నాను. తెలుగువారి నూత‌న సంవ‌త్సరాదికి ఆశావ‌హ ధృక్పథంతో స్వాగ‌తం ప‌లుకుదాం. క్రోధినామ ఉగాది తెచ్చిన ఉత్తేజంతో రాష్ట్ర ప్రగ‌తికి, ప్రజా సంక్షేమానికి పాటుప‌డ‌దాం.’ అని పేర్కొన్నారు నారా లోకేష్.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం..

ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించనున్నారు. జ్యోతిష్య సదస్సులో గౌరవ డాక్టరేట్ పొందిన మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణకర్తగా వ్యవహరించనున్నారు. కార్యాలయంలో జరిగే వేడుకలకు టీడీపీ అధినేత చంద్రబాబు సహా ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. పంచాంగ శ్రవణం కోసం టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2024 | 09:28 AM