Share News

TDP: నంద్యాల టీడీపీ నేతలతో నారా లోకేష్ భేటీ.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 10 , 2024 | 07:43 PM

టీడీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డితో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) ఆదివారం నాడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా సయోధ్య నారా లోకేష్ కుదిర్చారు.

TDP: నంద్యాల టీడీపీ నేతలతో నారా లోకేష్ భేటీ.. కారణమిదే..?

అనంతపురం జిల్లా(ఉరవకొండ): టీడీపీ (TDP) నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డితో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఆదివారం నాడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా సయోధ్య నారా లోకేష్ కుదిర్చారు.

ఫరూక్ విజయానికి సహకరించి ఇద్దరూ కలిసి పనిచేయాలని లోకేష్ దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో కలిసి టీడీపీ విజయానికి కృషి చేస్తామని ఫరూక్, భూమా బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. దాంతో లోకేష్ సంప్రదింపులు ఫలించినట్లయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన గౌరవం ఇస్తామని భూమా బ్రహ్మానంద రెడ్డికి లోకేష్ హామీ ఇచ్చారు. పార్టీ విజయానికి కృషి చేస్తానని లోకేష్‌కి బ్రహ్మానంద రెడ్డి చెప్పారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 07:43 PM