Share News

Buggana Rajendranath: అవును.. సంక్షేమానికే పెద్దపీట

ABN , Publish Date - Feb 07 , 2024 | 09:37 AM

Andhrapradesh: చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మానిఫెస్టోను పవిత్రంగా భావించింది వైసీపీ, జగన్ మాత్రమే అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్ అన్నారు.

Buggana Rajendranath: అవును.. సంక్షేమానికే పెద్దపీట

అమరావతి, ఫిబ్రవరి 7: చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మానిఫెస్టోను పవిత్రంగా భావించింది వైసీపీ, జగన్ మాత్రమే అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్ అన్నారు. జగన్ విధానాలు ఎన్నో రాజకీయ పార్టీలకు బెంచ్ మార్క్ అయిందన్నారు. అట్టడుగున ఉండే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని.. విద్య, వైద్యం, మహిళ సాధికారిత, వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు కాకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. విభజన హామీలు చాలా వరకు ఎన్నో సాధించుకోగలిగామన్నారు. అవును కచ్చితంగా సంక్షేమానికే పెద్దపీట ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 07 , 2024 | 09:47 AM