Home » Buggana Rajendranath
డోన్ (కర్నూలు): మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన కుమారుడు అమర్ నాథ్ అర్జున్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలోకి దించారు. ఇటీవల జలదుర్గం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానిక మహిళల నుంచి ఊహించని పరినామం ఎదురైంది.
Andhrapradesh: ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై డోన్ టీడీపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీకు దమ్ముంటే రాజకీయం చేయండి. పోలీసులను అడ్డుపెట్టుకొని డోన్ నియోజకవర్గం వ్యాపారులు, మైనింగ్ పారిశ్రామిక వేత్తలపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదు. జగన్ కంటే నా పైన ఫ్యాక్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయా?. దీనికి బుగ్గన సమాధానం చెప్పాలి’’ అంటూ డిమాండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఐదేళ్లుగా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు వైసీపీ ప్రభుత్వం చేసిందని గర్వంగా చెబుతున్నానన్నారు.
Andhrapradesh: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వంటి దార్శనికుల ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం పాలనను సాగిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
Andhrapradesh: చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మానిఫెస్టోను పవిత్రంగా భావించింది వైసీపీ, జగన్ మాత్రమే అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్ అన్నారు.
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అంతకుముందే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఛాంబర్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు పూజాలు నిర్వహించనున్నారు. ఈ కేబినెట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోద ముద్ర వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సొంత నియోజకవర్గం డోన్లో నిరసన సెగ తగిలింది. తెలుగుదేశం పార్టీ డోన్ ఇంచార్జీ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ‘టీడీపీ రైతు కరువు కేక’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆందోళనలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు.
అమరావతి, జనవరి 11: నాటి సీఎం చంద్రబాబుపై, నాటి ప్రభుత్వ అప్పులపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు.. అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లు పరిపాలించారు.. అయినా ఇప్పుడు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తరువాత కూడా అప్పులపై అవే అబద్ధాలా? వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమవ్వకపోతే జీతాలెందుకు లేటవుతున్నాయి?