Share News

Buggana Rajendranath: దార్శనికుల ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వ పాలన...

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:36 AM

Andhrapradesh: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి, రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వంటి దార్శనికుల ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం పాలనను సాగిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

Buggana Rajendranath: దార్శనికుల ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వ పాలన...

అమరావతి, ఫిబ్రవరి 7: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajashekar Reddy), రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) వంటి దార్శనికుల ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం పాలనను సాగిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) అన్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో (AP Assembly) 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను (Vote on Account Budget) మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన ప్రసంగిస్తూ... రాష్ట్ర సమస్యలను పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించామన్నారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

పాలనా విభాగాలను పునర్వవస్థీకరించి అన్ని వర్గాల వారికి సాధికారిత అందించామన్నారు. విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాద్యమ విద్యను వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్రవేశపెట్టిందని తెలిపారు. 1000 పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్ధులను సీబీఎస్ఈ పరిధిలోకి తీసుకువచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్య ప్రణాళిక, ప్రతీ విద్యార్ధికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం చేశామని చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 07 , 2024 | 11:41 AM