Share News

Botsa Satyanarayana: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:35 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొత్తులు కోసమా?.... అది జరిగితే అప్పుడు స్పందిస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు.

Botsa Satyanarayana: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
Minister botsa Satyanarayana

అమరావతి, ఫిబ్రవరి 7: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొత్తుల కోసమా?.... అది జరిగితే అప్పుడు స్పందిస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఎవ్వరితో వెళ్ళినా తమకు సంబంధం లేదని...తమ నాయకుడు ఒంటరిగానే వెళతాం అని అన్నారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ మాత్రం ఎవ్వరినీ వదులుకోదని మంత్రి స్పష్టం చేశారు.

షర్మిల సెక్యూరిటీపై...

కాగా.. సెక్యూరిటీకి సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై బొత్స పొడిపొడిగా స్పందించారు. ఆమెకు ఎప్పుడు సెక్యూరిటీ పెంచారో.. ఎప్పుడు తగ్గించారో తెలియదన్నారు. తనకు కూడా గతంలో సెక్యూరిటీ తీసేశారని.. అప్పుడు తనకు ముప్పు లేదని భావించి మరింత స్వేచ్చగా తిరిగానని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 07 , 2024 | 05:45 PM